Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..
- బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి- మంత్రి అచ్చెన్నాయుడు
- 3.1 లక్షల హెక్టార్లలో పూర్తైన రిజిస్ట్రేషన్లు- అచ్చెన్నాయుడు
- అవసరం ఉన్న ప్రతి రైతుకూ అమలు- అచ్చెన్నాయుడు
- బకాయిలు చెల్లింపుతో బిందు సేద్యానికి పునరుజ్జీవం- అచ్చెన్నాయుడు
- వేగంగా కంపెనీలకు బకాయిల చెల్లింపులు- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిందు సేద్యం అమలులో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6% భాగస్వామ్యంతో ప్రథమ స్థానంలో నిలిచిందని, తిరిగి బిందు సేద్యం అమలులో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ ఎత్తున బిందు సేద్యం కంపెనీలకు పెట్టిన బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించి పథకాన్ని తిరిగి పునరుద్ధరించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికే 3.01 లక్షల హెక్టార్లలో 2.50 లక్షల మంది రైతులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, 6,797 మంది రైతులకు చెందిన 7,253 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు ఇప్పటికే అందించామని వెల్లడించారు. మరో 13 వేల హెక్టార్లలో అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వం బకాయిలు చెల్లించి పథకానికి పునరుజ్జీవం పోసి అమలులో వేగం పెంచామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
ఇప్పటికే రూ.276 కోట్ల బకాయిలు చెల్లించామని, మరో పది రోజుల్లో రూ.104 కోట్లు చెల్లిస్తామని, నెల రోజుల్లో రూ.232 కోట్ల చెల్లింపులకు ఏర్పాట్లు చేసామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తామని, త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిని కలిసి రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంపై చర్చించనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన శాఖ (MIDH) పథకానికి నిధులు రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 3450 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియచేశారు. మామిడి, జీడిపప్పు బోర్డు ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు నూతన మండలాల కేటాయింపు, ఆయిల్ పామ్ ధరల నిర్ణయం, కోకోనట్ బోర్డు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!