Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Atchannaidu Said That The State Should Be An Example In Drip Irrigation

Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..

Published Date :October 28, 2024 , 9:57 pm
By Rajesh Veeramalla
  • బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి- మంత్రి అచ్చెన్నాయుడు
  • 3.1 లక్షల హెక్టార్లలో పూర్తైన రిజిస్ట్రేషన్లు- అచ్చెన్నాయుడు
  • అవసరం ఉన్న ప్రతి రైతుకూ అమలు- అచ్చెన్నాయుడు
  • బకాయిలు చెల్లింపుతో బిందు సేద్యానికి పునరుజ్జీవం- అచ్చెన్నాయుడు
  • వేగంగా కంపెనీలకు బకాయిల చెల్లింపులు- అచ్చెన్నాయుడు.
Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిందు సేద్యం అమలులో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6% భాగస్వామ్యంతో ప్రథమ స్థానంలో నిలిచిందని, తిరిగి బిందు సేద్యం అమలులో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..

Also Read

  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ ఎత్తున బిందు సేద్యం కంపెనీలకు పెట్టిన బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించి పథకాన్ని తిరిగి పునరుద్ధరించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికే 3.01 లక్షల హెక్టార్లలో 2.50 లక్షల మంది రైతులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, 6,797 మంది రైతులకు చెందిన 7,253 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు ఇప్పటికే అందించామని వెల్లడించారు. మరో 13 వేల హెక్టార్లలో అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వం బకాయిలు చెల్లించి పథకానికి పునరుజ్జీవం పోసి అమలులో వేగం పెంచామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?

ఇప్పటికే రూ.276 కోట్ల బకాయిలు చెల్లించామని, మరో పది రోజుల్లో రూ.104 కోట్లు చెల్లిస్తామని, నెల రోజుల్లో రూ.232 కోట్ల చెల్లింపులకు ఏర్పాట్లు చేసామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తామని, త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిని కలిసి రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంపై చర్చించనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన శాఖ (MIDH) పథకానికి నిధులు రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 3450 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియచేశారు. మామిడి, జీడిపప్పు బోర్డు ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు నూతన మండలాల కేటాయింపు, ఆయిల్ పామ్ ధరల నిర్ణయం, కోకోనట్ బోర్డు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • cm chandrababu
  • drip irrigation
  • Minister Atchannaidu
  • telugu news

తాజావార్తలు

  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions