Minister Ambati Rambabu: చంద్రబాబు, లోకేష్ వాగుడుతోనే ఇక్కడి దాకా తెచ్చుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ambati Rambabu: చంద్రబాబు, లోకేష్ వాగుడుతోనే పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు.. వైఎస్ జగన్ నన్ను ఏం పీకుతాడు అన్న చంద్రబాబు మాటలకు సమాధానం వచ్చింది.. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయట పడింది.. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు.. కక్ష సాధింపు చేయాలంటే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం.. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక, 17ఏని అడ్డు పెట్టుకొని బయట పడాలని చూస్తున్నారు.. కానీ, తప్పు చేయలేదని ఎక్కడ చెప్పడం లేదని దుయ్యబట్టారు మంత్రి అంబటి..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, పచ్చగా ఉన్న తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ కాలుతో మాడి పోయిందని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయితే రాజమండ్రిలో లేకుండా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పని అయిపోయిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రజలు అర్థం చేసుకోవాలి.. పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్లినట్లు ఉంది.. టీడీపీ.. పవన్ కల్యాణ్ ను కలుపుకుని వెళ్లడం అని సెటైర్లు వేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చేది.. కానీ, ప్రజా ధనాన్ని దోచుకుని దొంగలా దొరికితే సానుభూతి రాదన్నారు.. ముఖ్యమంత్రిగా చేసి అవినీతి కేసులో జైలుకు వెళ్లిన నాయకులకు రాజకీయ చరిత్ర లేదు, ఉండదని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: SL vs PAK: ప్రపంచకప్లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!
మరోవైపు.. లెళ్ల అప్పిరెడ్డి శాసనమండలి విప్ గా నియమించడంపై స్పందించిన మంత్రి అంబటి.. చాటా సంతోషంగా ఉందన్నారు.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వెరవ కుండా పోరాడే తత్వం అప్పిరెడ్డి ది.. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్తున్నాం.. గతం కన్నా మిన్నగా 175 సీట్లు గెలవాలన్న దే మా లక్ష్యం అన్నారు. పరిపాలన క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదన్న ఆయన.. సామాన్యుడి చెంతకు ప్రభుత్వం వెళ్లింది.. ఏ సర్టిఫికేట్ కావాలన్న క్యాంప్ పెట్టి మరి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో బస్సు యాత్ర చేపడుతున్నాం.. నవంబర్ 1వ తేదీ నుండి వై ఏపీ జగన్ నీడ్స్ అనే కార్యక్రమం చేస్తామని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!