Ambati Rambabu: రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్ఫుట్ సబ్సిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మిచౌంగ్ తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించింది.. అయితే, రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుంది.. గతంలో హెక్టార్కు 15 వేల సబ్సిడీ ఉంటే జీవో నెంబర్ 5 ద్వారా ఆ మొత్తాన్ని రూ.17 వేలకు పెంచామని వెల్లడించారు.
Read Also: IB ACIO 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 పోస్టులు.. పూర్తి వివరాలివే..
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
9వ తేదీ నుండి నష్టపరిహారం అంచనా వేయటానికి బృందాలు పర్యటిస్తాయి అని తెలిపారు మంత్రి అంబటి.. రైతాంగం వేసిన పంటల్లో 33 శాతం పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా ఉందన్న ఆయన.. రైతులు ధైర్యం గా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. ప్రతి సంవత్సరం రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నారు. తుఫాను సమాచారం రాగానే ప్రతి జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి అలెర్ట్ చేశారు.. సీఎం సూచనలతో లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.. వారికి అవసరమైన తాగు నీరు ఆహారం అందించారు.. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక, నాగార్జున సాగర్ లో నీళ్లు లేక సాగు చేయలేని దుస్థితిలో ఉన్న రైతులు కొందరైతే.. అప్పులు చేసి సాగుకు దిగితే ఇప్పుడు తుఫాన్.. రైతును ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ తుఫాన్ రైతాంగాన్ని ముంచేసింది.. అందుకే రైతాంగాన్ని ఆదుకునేందుకు, రైతాంగానికి అండదండగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!