Adluri Laxman Kumar: పనిలో నిజాయితీగా ఉండాలి.. పార్టీ కోసం పనిచేయాలి!
- అందరి కృషి, ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది
- పనిలో నిజాయితీగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి
- జీవన్ రెడ్డికి ఎప్పుడూ అండగా నిలుస్తాను
- తాజా మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
జగిత్యాల టౌన్ హాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… ‘అందరి కృషి, ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది. పనిలో నిజాయితీగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి.. 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను. కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతా. జీవన్ రెడ్డికి ఎప్పుడూ అండగా నిలుస్తాను. ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ.. అందరి సమస్యలు పరిష్కరిస్తాను’ అని చెప్పారు.
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
Also Read: Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం అదే!
అనంతరం జగిత్యాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్కు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ 15 నెలల్లో నేను చేసిన పనులను గుర్తించి అధిష్టానం మంత్రిని చేసిందన్నారు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా.. అందరిని కలుపుకుపోయే బాధ్యత అధిష్టానం తనపై పెట్టిందన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!