Adluri Laxman Kumar: పనిలో నిజాయితీగా ఉండాలి.. పార్టీ కోసం పనిచేయాలి!
- అందరి కృషి, ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది
- పనిలో నిజాయితీగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి
- జీవన్ రెడ్డికి ఎప్పుడూ అండగా నిలుస్తాను
- తాజా మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
జగిత్యాల టౌన్ హాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… ‘అందరి కృషి, ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది. పనిలో నిజాయితీగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి.. 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను. కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతా. జీవన్ రెడ్డికి ఎప్పుడూ అండగా నిలుస్తాను. ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ.. అందరి సమస్యలు పరిష్కరిస్తాను’ అని చెప్పారు.
Also Read
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
Also Read: Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం అదే!
అనంతరం జగిత్యాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్కు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ 15 నెలల్లో నేను చేసిన పనులను గుర్తించి అధిష్టానం మంత్రిని చేసిందన్నారు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా.. అందరిని కలుపుకుపోయే బాధ్యత అధిష్టానం తనపై పెట్టిందన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!