Metro Rail: మెట్రోలో రెస్టారెంట్.. ఇకపై తినడం.. ప్రయాణం చేయడం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఇప్పటికే మెట్రో రైలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకీ నగరాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా వేగవంతమైన ప్రయాణాల కోసం నగరాలలో మెట్రో రైలు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే రోజురోజుకి కొత్త టెక్నాలజీ, అలాగే ఆకర్షణ ఏమైనా సదుపాయాలతో మెట్రో ట్రైన్స్ రూపొందుతున్నాయి. నగరాలలో ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు మరికొన్ని రైలు మార్గాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకువస్తూ ప్రజలకు మెట్రో రైళ్ల సేవలను దగ్గరకు చేరుస్తుంది. దీనివల్ల సుఖవంతమైన ప్రయాణాన్ని నగరవాసులు అనుభూతి చెందుతారు. ఇకపోతే తాజాగా మెట్రో రైలు అధికారులు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రజల కోసం తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
Also read: Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
నగరవాసులకు మెట్రో రైలులో ప్రయాణం చేసిన సమయంలోనే భోజనం చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించబోతున్నారు. వీటికి సంబంధించి మెట్రో రైల్ లోనే రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇది మన హైదరాబాద్ నగరం మెట్రోలైతే కాదు. ఇది ఢిల్లీ దగ్గరలోని నోయిడా మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో దీన్ని ఏప్రిల్ 20వ తారీకున ప్రారంభిస్తున్నట్లు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా తెలిపారు.
నోయిడా సెక్టార్ 137 లోని మెట్రో స్టేషన్ లోని కోచ్లో ఈ కొత్త మెట్రో రైల్వే రెస్టారెంట్ సౌకర్యం అతి త్వరలో రానున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులు ఉదయం 11:30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్న సమయంలో భోజనం చేయొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఇందుకోసం మెట్రో కోచ్ లలో ప్రత్యేకమైన డైనింగ్ కాన్సెప్ట్ ను అధికారులు అభివృద్ధి చేశారు. ఇందుకు గాను సీట్లతో పాటు టేబుల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రెస్టారెంట్ల భాగంగా ఒకేసారి వందమంది కూర్చుని తినేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బయటనుంచి కూడా తమకి ఇష్టమైన ఆహారము, డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని డైనింగ్ కోచ్ లలో ఆస్వాదించవచ్చని వారు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!