Pakistan: “అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని హతమారుస్తాం”.. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదులపై రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదుల్ని వదలేది లేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, అక్కడికి వెల్లి వారిని చంపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ఈ వ్యాఖ్యలు ‘బాధ్యతారాహిత్యం’ అని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని శనివారం పాకిస్తాన్ ఖండించింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ‘‘ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి’’ అని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు దీర్ఘకాలిక నిర్మాణాత్మక అవకాశాలను అడ్డుకుంటాయి అని పేర్కొంది. పాకిస్తాన్ ఎల్లప్పుడు ఈ ప్రాంతంలో శాంతికి తన నిబద్ధతను ప్రదర్శిస్తోందని, పాకిస్తాన్ దృఢ సంకల్పం, తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర ధృవీకరిస్తుందని పేర్కొంది.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
Read Also: IPL 2024: ఎయిర్పోర్టులో అభిమానులపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వేలు చూపిస్తూ మరీ..!
పాకిస్తాన్లో భారత్ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ది గార్డియన్లో వచ్చిన నివేదికపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజు పాకిస్తాన్ స్పందించింది. ‘‘దేశ శాంతికి విఘాతం కలిగించడానికి ఎవరైనా ఉగ్రవాది ప్రయత్నిస్తే మేము తగిన సమాధానం ఇస్తాము. ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, మేం అక్కడికి వెళ్లి వారిని చంపేస్తాము’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
భారత్ ఎప్పుడూ కూడా ఏ దేశంపై దాడి చేయలేదు, వారి భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు, కానీ ఎవరైనా భారత్పై దాడికి ప్రయత్నిస్తే, శాంతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత్ ఈ విధంగా స్పందించేంత శక్తివంతంగా ఉందని, పాకిస్తాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించిందని ఆయన అన్నారు. బ్రిటీష్ వార్తా పత్రిక ది గార్డియన్ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్తాన్లో టార్గెటెడ్ కిల్లింగ్స్కి పాల్పడుతోందని ఆరోపించింది. అయితే, కేంద్ర ఈ వాదనల్ని తప్పుడు, హానికరమైన భారత వ్యతిరేక ప్రచారంగా తిరస్కరించింది. ఇతర దేశాల్లో టార్గెట్ కిల్లింగ్స్ భారత లక్ష్యం కానది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!