Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Border Dispute: మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్ను పొడిగించారు. అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో శుక్రవారం పబ్లిక్ ఆర్డర్ను విడుదల చేస్తూ, మేఘాలయ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలు అంటే పశ్చిమంలో ఇంటర్నెట్ షట్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించింది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి – భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, నైరుతి ఖాసీ హిల్స్ జిల్లాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ను పొడిగించారు.
పేర్కొన్న జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్ నవంబర్ 26 ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది.ముందుగా నివేదించినట్లుగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో గురువారం సాయంత్రం దుర్మార్గులు ట్రాఫిక్ బూత్ను తగలబెట్టి, సిటీ బస్సుతో సహా మూడు పోలీసు వాహనాలపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 22న అస్సాం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసాకాండకు నిరసనగా కొన్ని గ్రూపులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు, అస్సాం ఫారెస్ట్ గార్డ్ సిబ్బంది సహా ఆరుగురు మరణించారు. ఈ సంఘటన మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముఖోహ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Also Read
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Tiger with Baby’s : తన 3 పిల్లలతో పులి సంచారం.. రంగంలోకి రెస్య్కూ టీం
ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు మోహరించిన పోలీసు బలగాలపై ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు. నిరసనకారులను చెదరగొట్టడానికి, లా అండ్ ఆర్డర్ను అమలు చేయడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో సిటీ బస్సు, జీప్ సహా మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని షిల్లాంగ్లోని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ ఎస్. నోంగ్ట్న్గర్ ఫోన్లో తెలిపారు. నగరంలోని ట్రాఫిక్ బూత్ను తగలబెట్టిన దుండగులు పోలీసు సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారని ఎస్పీ తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున, మధ్యాహ్నం అస్సాం నుంచి వచ్చిన పోలీసులు, ఫారెస్ట్ గార్డులతో కూడిన బృందం.. గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించగా.. అనేకమంది గాయపడ్డారు. అస్సాంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లా, మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్లోని ముక్రోహ్ గ్రామం సరిహద్దు ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. మృతి చెందిన వారిలో అస్సాంకు చెందిన ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నాడు.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!