Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Border Dispute: మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్ను పొడిగించారు. అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో శుక్రవారం పబ్లిక్ ఆర్డర్ను విడుదల చేస్తూ, మేఘాలయ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలు అంటే పశ్చిమంలో ఇంటర్నెట్ షట్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించింది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి – భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, నైరుతి ఖాసీ హిల్స్ జిల్లాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ను పొడిగించారు.
పేర్కొన్న జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్ నవంబర్ 26 ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది.ముందుగా నివేదించినట్లుగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో గురువారం సాయంత్రం దుర్మార్గులు ట్రాఫిక్ బూత్ను తగలబెట్టి, సిటీ బస్సుతో సహా మూడు పోలీసు వాహనాలపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 22న అస్సాం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసాకాండకు నిరసనగా కొన్ని గ్రూపులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు, అస్సాం ఫారెస్ట్ గార్డ్ సిబ్బంది సహా ఆరుగురు మరణించారు. ఈ సంఘటన మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముఖోహ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Also Read
- US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
- Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్కు హెచ్చరిక
- White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
Tiger with Baby’s : తన 3 పిల్లలతో పులి సంచారం.. రంగంలోకి రెస్య్కూ టీం
ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు మోహరించిన పోలీసు బలగాలపై ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు. నిరసనకారులను చెదరగొట్టడానికి, లా అండ్ ఆర్డర్ను అమలు చేయడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో సిటీ బస్సు, జీప్ సహా మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని షిల్లాంగ్లోని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ ఎస్. నోంగ్ట్న్గర్ ఫోన్లో తెలిపారు. నగరంలోని ట్రాఫిక్ బూత్ను తగలబెట్టిన దుండగులు పోలీసు సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారని ఎస్పీ తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున, మధ్యాహ్నం అస్సాం నుంచి వచ్చిన పోలీసులు, ఫారెస్ట్ గార్డులతో కూడిన బృందం.. గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించగా.. అనేకమంది గాయపడ్డారు. అస్సాంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లా, మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్లోని ముక్రోహ్ గ్రామం సరిహద్దు ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. మృతి చెందిన వారిలో అస్సాంకు చెందిన ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నాడు.
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
-
Toxic: యష్ ఇచ్చిన హింట్తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
-
E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?