Maoists : ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్కు మావోయిస్టుల పిలుపు
- తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20 న బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు
- ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ బంద్ కు పిలుపు
- అధికార ప్రతినిధి జగన్ పేరు తో లేఖ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ సహా 7 మంది మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు.
కామ్రేడ్ గౌతం, భాస్కర్ వంటి 30 ఏళ్ల విప్లవ అనుభవం కలిగిన నాయకులు ఈ ఆపరేషన్లో అమరులయ్యారని పేర్కొన్నారు. గౌతం విజయవాడలోని ఆయుర్వేద మెడికల్ కళాశాలలో విద్యార్ధిగా ఉండగా, ఆర్ఎస్యూ ద్వారా ఉద్యమంలో చేరారు. 1981లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారి, పలు ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. భాస్కర్ అదిలాబాద్ డివిజన్లోని పలు గ్రామాల్లో పనిచేసి, రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..
ప్రభుత్వ బలగాలు ఈ దాడుల్లో విప్లవకారులను అణిచివేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాయని మావోయిస్టులు విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి కలిగించే విధంగా అడవుల్లోని ఆదివాసీలపై దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ, గతంలో చర్చల నిమిత్తం వచ్చిన తమ ప్రతినిధి కామ్రేడ్ స్టధాకర్ను కూడా ప్రభుత్వం హత్యచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, వాస్తవిక లక్ష్యం విప్లవ ఉద్యమాన్ని అణచివేయడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా జూన్ 20న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!