Madhyapradesh: పెంపుడు కుక్క కోసం గొడవ.. భార్యాపిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం నాడు 45 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం గొడవపడి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు.
Read Also: Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
అసలేం జరిగిందంటే.. దిలీప్ పవార్ అనే వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో బాద్నగర్లోని ఇంట్లో నివాసం ఉంటున్నాడు. దిలీప్ పవార్కు మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం సేవించి అతడు నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున 1 గంటలకు తన పెంపుడు కుక్క అతన వద్దకు వచ్చి మొరిగింది. ఆగ్రహంతో లేచిన అతను ఇంట్లోంచి కత్తి తీసుకుని కుక్కను చంపేందుకు పరుగెత్తాడు. ఈ సమయంలో అతని భార్య గంగ దిలీప్ను అడ్డుకుంది. పెంపుడు జంతువును చంపకుండా వదిలేయాలని అతనితో గొడవపడింది. దీనితో కోపోద్రికుడైన దిలీప్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. తన కుమార్తె నేహాపై, కొడుకు యోగేంద్రపై కత్తితో దాడి చేశాడు. దీని కారణంగా పిల్లలిద్దరూ కూడా మరణించారు. ఈ సమయంలో ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తమ ప్రాణాలను రక్షించుకుని పారిపోయారు. దీంతో దిలీప్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: DRDO Drone Crash: పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీవో డ్రోన్
ప్రాణాలను కాపాడుకుని పారిపోయిన చిన్నారులు చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. ప్రజల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు పడి ఉన్నాయి. ప్రాథమిక విచారణలో దిలీప్ పవార్ విపరీతంగా మద్యం సేవించేవాడని అధికారి తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన అతడు మద్యం మత్తులో ఉన్నాడని ఇప్పుడే నమ్మకంగా చెప్పలేమని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. నిందితుడికి కొన్ని నెలల నుంచి ఉద్యోగం లేదు. అతనికి సరుకు రవాణా వాహనం ఉంది. దానితో అతను జీవనోపాధి పొందుతున్నాడ., అయితే అతను దానిని కొంతకాలం క్రితం విక్రయించినట్లు విచారణలో తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!