Mahesh Kumar Goud : మునుగోడు వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Working President Mahesh Kumar Goud MLA Komatireddy Rajgopal Reddy Issue.
తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాకు అవమానం జరిగిందటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదురించే సత్తా బీజేపీకే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దీంతో అధిష్టానం ఢిల్లీకి రావాలని కబురు పెట్టడంతో.. నియోజకవర్గ పర్యటనలో ఉన్నానని అయ్యాక వస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీ పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. నిన్న కేసీ వేణుగోపాల్ తో ముఖ్య నేతలు, నల్గొండ జిల్లా నేతలు చర్చించారని, మునుగోడుపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
Also Read
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Trisha: విజయ్ చిత్రం "జన నాయగన్"పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
DK Aruna : యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు
మునుగోడు వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు. మునుగోడును నల్గొండ జిల్లా నేతలు చూసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడదు..అది సమూహమని ఆయన వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే గా ఉన్నారు.. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారని, చాలా మంది నేతలను ఈడీ బూచితో బెదిరించి బీజేపీలోకి లాగలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని, అది 10 – 12 నియోజకవర్గలకే పరిమితమన్నారు మహేశ్ గౌడ్. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తామని, అది నేను చెప్పేది కాదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ మంత్రుల, శాసన సభ్యులు, బీజేపీకి చెందిన కీలక నేతలు మాతో టచ్ లో ఉన్నారని ఆయన తెలిపారు. వారంతా త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారని, పార్టీలో చేరికలపై నెల రోజుల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
-
Varun Tej: రిలీజ్కు ముందే వరుణ్ తేజ్ జాక్పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!