NTV Telugu Site icon

Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్‌ హీరోలు.. ఫొటో వైరల్‌!

3 Heros In One Frame

3 Heros In One Frame

South Star Heros Photo Goes Viral at Anant Ambani Wedding: టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ హీరోలు ఒకేచోట కలిశారు. అంతేకాదు కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మహేశ్‌ బాబు, సూర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహంలో వీరందరూ కలిశారు. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్ షేర్ చేశారు. ‘మంచి మనసున్న వ్యక్తులతో అద్భుతమైన క్షణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Devshayani Ekadashi 2024: నేడు తొలి ఏకాదశి.. ఈ 6 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అవుట్!

మహేశ్‌బాబు-నమ్రత, సూర్య-జ్యోతిక, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌-సుప్రియ, విఘ్నేశ్‌ శివన్‌-నయనతార దంపతులతో పాటు జెనీలియా డిసౌజా, అఖిల్‌ అక్కినేని, సితార ఘట్టమనేని తదితరులను ఫొటోలో చూడొచ్చు. స్టార్లతో ఉన్న ఈ ఫోటో కన్నుల పండగగా ఉంది. ఈ ఫొటోకు నెట్టింట లైకుల,కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఒకే ఫ్రేమ్‌లో స్టార్స్‌’, ‘అద్భుతమైన ఫోటో’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి రజనీకాంత్‌, వెంకటేశ్‌, రామ్‌ చరణ్‌ కూడా పెళ్లికి హజరయ్యారు. అనంత్‌ అంబానీ పెళ్లికి బాలీవుడ్‌ మొత్తం కదిలొచ్చిన విషయం తెలిసిందే.