Ajit Pawar: ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడీపై అజిత్ పవార్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ సోమవారం అన్నారు. మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), కాంగ్రెస్, ఎన్సీపీ ఉన్నాయి. మహారాష్ట్రలోని పుణెలో అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. మహావికాస్ అఘాడీ అగ్రనేతలు రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అజిత్ పవార్ తెలిపారు.
సొంత పార్టీ గురించి ఆలోచించకుండా మెరిట్తో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏ పరిస్థితిలోనైనా మహావికాస్ అఘాడీ నాయకులు కలిసి కూర్చుని, వారి సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్ మెరిట్పై అభ్యర్థిని నిర్ణయిస్తారు. మహావికాస్ అఘాడీ కూటమిలో ఎమ్మెల్యే, ఎంపీని ఎలా ఎంపిక చేసుకోవాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మహావికాస్ అఘాడీ కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఎంవీఏలోని పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని అజిత్ పవార్ అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన-బీజేపీ కూటమిని ఓడించడానికి ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయవలసి ఉందన్నారు.
Also Read
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
Read Also: Viral news : ఓరి నాయనో..కొంచెం కూడా సిగ్గులేదేంట్రా బాబు.. బైకుపైనే పాడుపని.. ఛీ..
“ఎంవీఏలోని పార్టీలు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేవనేది వాస్తవం. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా విజయం సాధ్యం కాదనే వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాలి, కాబట్టి ప్రస్తుత శివసేన ఏకనాథ్ షిండేను ఓడించాలనుకుంటే. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనం కలిసి ఉండాలి, ఎలాంటి తేడా లేకుండా కలిసి పోటీ చేయాలి, అప్పుడు ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం’’ అని పవార్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, దేశ సాధారణ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!