Konda Surekha : మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
- మహా శివరాత్రి ఘనంగా నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం
- శివక్షేత్రాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
- వేములవాడ, కాళేశ్వరం సహా ప్రధాన ఆలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవక్షేత్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రముఖ శివక్షేత్రాల్లో భద్రతా చర్యలు, వసతుల కల్పన, ప్రాంగణ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు క్షుణ్ణంగా చేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం, రామప్ప శివాలయం, మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం, చాయా సోమేశ్వర ఆలయం (పానగల్), పాలకుర్తి సోమేశ్వర దేవాలయం, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయం తదితర ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
Also Read
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ పండుగ రోజున అనుసరించాల్సిన చర్యలను పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా:
- భక్తులకు తాగునీరు, విడిది, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలి.
- అన్నదానం, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.
- దేవాలయ సాంప్రదాయాలకు అనుగుణంగా రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాల నిర్వహణ ఏర్పాట్లు చేయాలి.
- విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఆలయ ప్రాంగణంలో అదనపు లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
- భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ మేనేజ్మెంట్ పటిష్ఠంగా అమలు చేయాలి.
ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక సమీక్ష
ఈ పండుగ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో జరిగే కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్లోని ఎండోమెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం
ప్రతి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రభుత్వ బాధ్యతగా ప్రతి భక్తుడూ శివరాత్రి పండుగను ఆనందంగా జరుపుకునేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
మహా శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున, ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని అమలు చేయాలని సూచించారు.
Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!