Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
- ఏ తల్లి కూడా తన బిడ్డను కొట్టదు..
- బిడ్డపై దాడి కేసులో మహిళకు బెయిల్..
- బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఏ తల్లీ తన సొంత బిడ్డను కొట్టదు అని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కొడుకుపై దాడి చేసినందుకు తల్లితో సహా ఆమె భాగస్వామిపై కేసు నమోదై, అరెస్ట్ చేయబడ్డారు. అయితే, తాజాగా ఈ కేసులో బాలుడి తల్లి అయిన 28 ఏళ్ల మహిళకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బాలుడి తండ్రి, తల్లి మధ్య వైవాహిక వివాదం ఉంది. దీని కారణంగా ఆ బిడ్డ బాధపడుతున్నాడని, బలిపశువుగా మారాడని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. బాలుడి వైద్య నివేదికల ప్రకారం.. అతను మూర్ఛరోగంతో బాధపడుతున్నాడని, పోషకాహార లోపం, రక్తహీనతతో ఉన్నట్లు చూపిస్తు్న్నాయని కోర్టు తెలిపింది. నిందితురాలైన తల్లి బిడ్డ సంరక్షణకు మద్దతు అందించేందుకు చాలా ఇబ్బంది పడినట్లు వివిధ వైద్య పత్రాలు చూపిస్తున్నాయని పేర్కొంది.
Also Read
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
Read Also: Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..
మహిళను అక్టోబర్ 2023లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె కస్టడీలోనే ఉంది. మైనర్ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడి భార్య, ఆమె భాగస్వామి అనేక సందర్భాల్లో బాలుడిపై శారీరకంగా దాడి చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేశాడు. ఒకసారి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. ముంబై దహిసర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ భాగస్వామి బాలుడిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే, హైకోర్టు ప్రాథమికంగా అన్ని ఆరోపణలు నమ్మశక్యం కాదని పేర్కొంది. ‘‘ఏ తల్లి కూడా తన సొంత బిడ్డని కొట్టాలని అనుకోదు’’ అని రూ. 15,000 వ్యక్తిగత పూచికత్తుపై మహిళకు హైకోర్టు బెయిల్ని మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులకు అరెస్టుకు గల కారణాలను తెలియజేయడానికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని తప్పనిసరి నిబంధనలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు గుర్తించింది. బాలుడి తల్లిదండ్రులు 2019లో విడిపోయిన తర్వాత, బాలుడు తన తండ్రితో కలిసి మహారాష్ట్రలోని రత్నగిరిలో నివసిస్తున్నాడు. అయితే, 2023లో బాలుడి తల్లి అతడిని బలవంతంగా ముంబైకి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?