Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Madras High Court Punished 215 People In A Single Case

Madras High Court: 31 ఏళ్ల నాటి ఘటనలో న్యాయం..ఒకే కేసులో 215 మందికి శిక్ష

Published Date :September 30, 2023 , 8:19 am
By Sravani
Madras High Court: 31 ఏళ్ల నాటి ఘటనలో న్యాయం..ఒకే కేసులో 215 మందికి శిక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాపాడాల్సిన పోలీసులే తనిఖీల పేరిట మహిళలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ బాధితులకు 31 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఒకేసారి 215 మందికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇది 1992 నాటి ఘటన. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్‌ కొండప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. కల్వరాయన్ కొండప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ఉంది వాసాత్తి అనే చిన్న గ్రామం. గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందంటూ 1992 జూన్‌ 20వ తేదీన పోలీసులు తనిఖీలకు వచ్చారు. 1992 జూన్‌ 20వ తేదీన 155 మంది అటవీసిబ్బంది, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూశాఖ అధికారులు కలిపి మొత్తం 269 మంది ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీ చేశారు. తమ సోదాల్లో కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 90 మంది మహిళలతో సహా 133 మందిపై కేసు నమోదుచేశారు. అంతటితో ఆగని పోలీసులు ఈ వంక దొరికింది కదా అని తమ ఇష్టారీతిన ప్రవర్తించారు.

Also Read: Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ రసం తాగితే.. ఊహించని ఫలితాలు మీ సొంతం..

గ్రామ ప్రజలను చిత్ర హింసలకు గురిచేసిన పోలీసులు 18 మంది గిరిజన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు ఆరూర్‌ పోలీసులను ఆశ్రయించినా తామంతా ఒకటే అన్నట్లు వారు కేసు నమోదు చేయలేదు. తరువాత బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. పోలీసులపై కేసు నమోదు చేసినా విచారణ ముందుకు సాగకపోవడంతో దీనిని సీబీఐకి అప్పగించాలని బాధితులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దాంతో 1995 ఫిబ్రవరి 24వ తేదీన ఈ కేసు సీబీఐకి బదిలీ చేసింది ధర్మాసనం. దర్యాప్తులో భాగంగా వాసాత్తిలో విధ్వంసం సృష్టించిన మొత్తం 269 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. చివరకు ధర్మపురి జిల్లా కోర్టు  2011 సెప్టెంబరు 29వ తేదీన తీర్పు వెలువరించింది.

269 మంది నిందితుల్లో తీర్పు వెలువరించేనాటికి బతికున్న 215 మందిని దోషులుగా తేల్చారు. వారిలో 12 మందికి పదేళ్ల జైలు, ఐదుగురికి ఏడేళ్లు, మిగిలిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. అయితే  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేల్‌మురుగన్‌ ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో 215 మందికి జైలుశిక్ష విధిస్తూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఖరారుచేసింది.అంతేగాక బాధితులైన 18 మంది మహిళలకు తలా రూ.10 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇందులో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి, రూ.5 లక్షలు నిందితుల నుంచి వసూలుచేయాలని స్పష్టం చేసింది. అంతేగాక నాటి ధర్మపురి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అటవీశాఖ అధికారిపై కఠినచర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. ఇక ఒకే కేసులో ఇంతమందికి శిక్షపడడం దేశచరిత్రలో ఇదే ప్రథమం. అదీ ఘటన జరిగిన మూడు దశాబ్దాల తరువాత ఇంతమందికి  శిక్ష ఖరారు చేయడం అరుదైన ఘటనగానే పేర్కొనాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • LATEST TELUGU NEWS
  • Madras High Court
  • smuggling

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions