Kurnool Crime: ప్రేమ జంట ఆత్మహత్య.. కులాలే ప్రాణం తీశాయి..!
Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగుతోంది.. మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు ప్రధాన కారణం.. వారి ఇద్దరి కులాలు వేరు కావడమే అంటున్నారు.. తుంగభద్ర రైల్వేస్టేషన్ సమీపంలో రెండు మృతదేహాలు పడిఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు సమాచారం చేరవేశారు.. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రెండు మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మృతులు మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (20) మంత్రాలయంకు చెందిన నందిని (19)గా గుర్తించారు పోలీసులు… గత కొంత కాలంగా వెంకటేష్, నందిని ప్రేమించుకోగా.. వారి వ్యవహారం కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది.. అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు ఇరు కుటుంబాల పెద్దలు. దీంతో, విడిచి ఉండలేక, కలిసి బతకలేక.. ఇద్దరం కలిసి చావాలనే నిర్ణయానికి వచ్చిన ఆ ప్రేమ జంట.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, కొందరు ప్రేమించుకోవడం.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు కూడా చేసుకుంటుంటే.. మరికొందరు.. ఇలా ప్రాణాలు తీసుకుంటూ.. కన్నవారి ఆశలు అడియాశలు చేస్తున్నారు. ఎంతో విలువైన జీవితాన్ని.. ఆదిలోనే ముగించేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?