Lok Sabha Elections: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి కుమారుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు శ్రీనివాస్ రెడ్డి చేయూత నందించనున్నారు.
READ MORE: Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై కూడా కసరత్తు చేస్తోంది. తెలంగాణాలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ.. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తి నేతలపై కన్నేసింది. వారినే టార్గెట్గా చేసుకుని సమయం దొరికి నప్పుడు నెమ్మదిగా పార్టీలోకి లాగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలోని మెజార్టీ నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ప్రకటించిన ఎంపీ అభ్యర్థు్ల్లో సైతం చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!