Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chinese High Tech Research Ship Back In Maldives Waters

Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!

Published Date :April 26, 2024 , 7:27 pm
By Suresh Maddala
Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

4,500 టన్నుల హైటెక్ చైనీస్ పరిశోధన నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత తిరిగి మాల్దీవుల జలాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జుకి చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే డ్రాగన్ రీసెర్చ్ షిప్ మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశమైంది.

భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తాక మాల్దీవులు.. చైనాకు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్‌ పరిశోధక నౌక వారం పాటు మాల్దీవుల జలాల్లో ఉండి వెళ్లిపోయింది. తిరిగి రెండు నెలల తర్వాత.. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 గురువారం ఉదయం తిలాఫుషీ ఇండస్ట్రియల్‌ హార్బర్‌లో లంగరేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ నౌక ఎందుకు తిరిగొచ్చిందన్న విషయాన్ని ముయిజ్జు సర్కారు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Spiderman: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..

దాదాపు 4,500 టన్నుల బరువున్న ఈ పరిశోధక నౌక.. ఈ ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయల్దేరింది. దాదాపు నెల రోజుల పాటు మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ సరిహద్దుల్లో తిరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తిలాఫుషీ పోర్టుకు చేరుకుని దాదాపు వారం రోజుల తర్వాత అక్కడినుంచి తిరిగెళ్లింది. దాదాపు రెండు నెలల పాటు పలు పోర్టులకు వెళ్లిన ఈ నౌక ఇప్పుడు మళ్లీ మాల్దీవులు తీరానికి చేరుకుంది. అంతకుముందు ఈ నౌక మాలె తీరానికి వచ్చిన విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి ధ్రువీకరించారు. సిబ్బంది రొటేషన్‌ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకు దాన్ని అనుమతించినట్లు తెలిపారు.

ఈ నౌక చైనాలోని థర్డ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్రగర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని డ్రాగన్‌ గతంలో వెల్లడించింది. గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్యకలాపాలు నిర్వహించాయి. ఇవి జలాల్లో మాత్రమే పరిశోధనలు చేస్తాయని చైనా చెబుతున్నా.. భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగనతలంపై నిఘా ఉంచగలవనే ఆరోపణలున్నాయి. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నౌక ఉన్న మాల్దీవుల ప్రాంతం భారత్‌లోని లక్షద్వీప్‌లో గల మినికోయి ద్వీపానికి కేవలం 70 నాటికల్‌ మైళ్ల దూరంలోనే ఉంది. దీంతో దీని కదలికల్ని భారత నేవీ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అయితే తాజా రాకపై భారత నౌకాదళం ఇంకా స్పందించలేదు.

ఇది కూడా చదవండి: Lok Sabha Election: ముగిసిన రెండో విడత పోలింగ్.. ఎంత శాతమంటే..!

ఈ నౌకను లవణీయత, సూక్ష్మజీవుల జన్యు అధ్యయనాలు, నీటి అడుగున ఖనిజాల అన్వేషణ, నీటి అడుగున జీవితం మరియు పర్యావరణ అధ్యయనాల కోసం కూడా ఉపయోగించవచ్చని పేర్కొంది. ఇది సముద్ర ప్రవాహాలు, తరంగాలు మరియు ముఖ్యమైన పర్యావరణ సమాచారాన్ని కొలవగల డేటా బోయ్‌లను కలిగి ఉంది. ఈ బోయ్‌లు చైనా ప్రభుత్వానికి రియల్ టైమ్ శాటిలైట్ సమాచారాన్ని అందజేస్తాయని నివేదిక పేర్కొంది. షియాంగ్ యాంగ్ హాంగ్ 03 నౌక సముద్ర పరిశోధన కోసం దేశంలో తయారు చేయబడిన అత్యంత ఆధునిక నౌక అని పేర్కొంది. ఇది ఒక సమగ్ర పరిశోధనా నౌక అని చైనా చెబుతోంది. అంటే ఇది ఒకటి కంటే ఎక్కువ పనుల కోసం అమర్చబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Shadnagar: ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Back
  • Chinese
  • High tech research ship
  • Maldives waters

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions