EC Action: ఎన్నికల వేళ కొనసాగుతున్న బదిలీల వేట.. ఈసారి ఏ రాష్ట్రాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవలే ఆయా రాష్ట్రాల్లో కొందరి అధికారులపై వేటు వేసింది. తాజాగా మరోసారి ఆ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ కొనసాగించింది. ఎన్నికలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా అస్సాం, పంజాబ్లోని జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారుల్ని బదిలీ చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విధుల నుంచి పక్కనపెట్టినట్లు తెలిపింది. అలాగే పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నాన్ ఎన్కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను కూడా ఇతర విభాగాలకు మార్చాలని ఆయా ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం సూచించింది.
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
ఇటీవల పశ్చిమ్ బెంగాల్ డీజీపీతో పాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. వారితో పాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను కూడా బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధంలేని విధులకు డీజీపీ రాజీవ్ కుమార్ను బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్కు జూనియర్గా ఉన్న అధికారిని డీజీపీగా తాత్కాలికంగా నియమించాలని సూచించింది. అనంతరం వెంటనే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర్ప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోంశాఖల కార్యదర్శులపైనా ఈసీ వేటు వేసింది. వీరంతా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మరో చోట విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల పోలింగ్కు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇక కేంద్రం పంపిస్తున్న వికసిత్ భారత్ వాట్సాప్ మెసేజ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేంద్రం ఈ మెసేజ్లను పంపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!