EC Action: ఎన్నికల వేళ కొనసాగుతున్న బదిలీల వేట.. ఈసారి ఏ రాష్ట్రాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవలే ఆయా రాష్ట్రాల్లో కొందరి అధికారులపై వేటు వేసింది. తాజాగా మరోసారి ఆ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ కొనసాగించింది. ఎన్నికలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా అస్సాం, పంజాబ్లోని జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారుల్ని బదిలీ చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విధుల నుంచి పక్కనపెట్టినట్లు తెలిపింది. అలాగే పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నాన్ ఎన్కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను కూడా ఇతర విభాగాలకు మార్చాలని ఆయా ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం సూచించింది.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ఇటీవల పశ్చిమ్ బెంగాల్ డీజీపీతో పాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. వారితో పాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను కూడా బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధంలేని విధులకు డీజీపీ రాజీవ్ కుమార్ను బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్కు జూనియర్గా ఉన్న అధికారిని డీజీపీగా తాత్కాలికంగా నియమించాలని సూచించింది. అనంతరం వెంటనే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర్ప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోంశాఖల కార్యదర్శులపైనా ఈసీ వేటు వేసింది. వీరంతా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మరో చోట విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల పోలింగ్కు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇక కేంద్రం పంపిస్తున్న వికసిత్ భారత్ వాట్సాప్ మెసేజ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేంద్రం ఈ మెసేజ్లను పంపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!