Diamonds: సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం.. భారీగా తరలివస్తున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Searching For Diamonds: ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు. పిడుగురాళ్ల రోడ్డు శివారు ప్రాంతమైన బసవమ్మ వాగు దగ్గర రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు.. అక్కడ రోడ్ల కోసం బెల్లంకొండ నుండి తెచ్చిన ఎర్రమట్టిని పోశారు. ఈ విషయం తెలిసిన కొందరు వజ్రాలు, రంగు రాళ్లు దొరుకుతాయేమోనని వేట మొదలుపెట్టారు. వర్షం పడితే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి రోజంతా అక్కడే ఉండి రాళ్ల కోసం కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టపక్కల ప్రాంతాల వారు.. తమ వాహనాలలో అక్కడికి వచ్చి.. ఒక్క వజ్రం దొరికినా చాలని వజ్రాల కోసం వెతుకుతున్నారు.
Also Read: Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే కోహినూర్ వజ్రం దొరికిందని స్థానికంగా ప్రచారముంది . కృష్ణా నది తీరంలో ఉండే ఈ గ్రామం ప్రస్తుతం పులిచింతల బ్యాక్ వాటర్లో మునిగి పోయింది. గతంలో ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాగేది. తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్ళూరు వెళ్ళి కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారు. అక్కడ కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలించారట.. ఆ ప్రాంతం నుంచి తెచ్చిన మట్టి కావడంతోనే ఇలా గాలిస్తున్నారు. అందులో పక్కాగా వజ్రాలు, రంగు రాళ్లు ఉంటాయని నమ్ముతున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వర్షం పడిన వెంటనే స్థానికులు ఆ మట్టిలో వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకంతో వజ్రాల కోసం వెతకడం మొదలు పెట్టారు. రెండు రోజుల నుండీ ఇక్కడ వజ్రాల వేట సాగుతుంది. వజ్రాలు కాకపోయినా రంగు రాళ్ళైన దొరుకుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం మీద బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.
Also Read: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
అంతేకాకుండా ఆ ప్రాంతంలో వజ్రాల టెస్టింగ్ మెషీన్లతో బంగారు వర్తక వ్యాపారులు కూడా దర్శనమిస్తున్నారు. బంగారు వ్యాపారులు టెస్టింగ్ మెషీన్లతో వ్యాపారం ప్రారంభించారు. టెస్టింగ్కు రూ.100 తీసుకుంటున్నారట. గతంలో కూడా తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్లూరు వెళ్లి.. అక్కడ కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారని చెబుతున్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే చాలు కోటీశ్వరులు కావొచ్చనే ఆశకో వజ్రాల కోసం వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!