Land Scam: మార్కాపురంలో భూమాయగాళ్లు.. 21 ఎకరాల భూమి దోపిడీ బట్టబయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Scam: మార్కాపురంలో టీడీపీ నేతల భూకబ్జా బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా పేదల నుంచి స్వాధీనం చేసుకున్న భూదందా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మార్కాపురం పరిధిలోని సర్వే నంబర్ 1119లో వున్న చుక్కల భూములను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుటుంబ తమ పేరు పైకి బదిలీ చేయించుకున్న విషయం బయటకు వచ్చింది. 1924 నుంచి వ్యవసాయ భూములుగా ఉన్న 21 ఎకరాల 3 సెంట్ల భూమిని కందుల నారాయణ రెడ్డి కుటుంబం అక్రమంగా సొంతం చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు భూములపై కందుల నారాయణ కుటుంబానికి చెందినవిగా ఆధారాలు చూపాలని అల్టిమేటం జారీ చేశారు. అయితే వాటిని చూపటంలో కందుల నారాయణ రెడ్డి విఫలం కావడంతో అధికారులు లోతుగా విచారణ జరిపారు.
Also Read: Pawan Kalyan: బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు
Also Read
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్లోకి స్వాగతం' అంటూ..
- RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
ప్రకాశం జిల్లా డోర్నాల మండలం హసనాబాద్ గ్రామస్తులైన బాధితులు ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్కు లేఖ రాయడం తో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ తాతల కాలం నాటి భూములను వంశపారంపర్యంగా తాము సాగు చేసుకుంటున్నామని.. అయితే ఈమధ్య కాలంలో కొంతమంది తమకు తెలియకుండా తమ 21 ఎకరాల 3 సెంట్ల భూమిని ఆక్రమించాలనే ఉద్ధేశంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని భూయజమాని అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి చెందిన భూమిపై దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని ఫిర్యాదు చేయడంతో కందుల నారాయణ రెడ్డి కుటుంబం భూదందా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ డాక్యుమెంట్లు, వాటిపై జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ భూకబ్జాపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ మొదలైంది. ఈ భూదందాపై సిట్తో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు బాధితులు లేఖ రాశారు.



తాజావార్తలు
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్లోకి స్వాగతం’ అంటూ..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!