KVP Ramachandra Rao: కేవీపీ కీలక వ్యాఖ్యలు.. ఆంధ్రుడిగా సిగ్గు పడుతున్నా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVP Ramachandra Rao: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కేవీపీ కీలక వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడితే.. దేశంలోని ఒక్క ఎంపీ కూడా ఖండించలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు. రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
ఇక, జగన్, పవన్, చంద్రబాబు తమ తమ పార్టీలను ఎందుకు బీజేపీలో విలీనం చేయటం లేదో అర్దం కావటం లేదు అంటూ సెటైర్లు వేశారు కేవీపీ.. బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తటానికి మూడు పార్టీలు తొందర పడుతున్నాయని ఆరోపించారు.. అయితే, వైఎస్ చివరి సందేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్నారు.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వైఎస్ కు నిజమైన నివాళి, ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. మరోవైపు.. 2018లో దురదృష్టవశాత్తూ టీడీపీతో కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
రాజ్యసభలో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పని చేశానని గుర్తుచేసుకున్నారు కేవీపీ.. రాహుల్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగాల్లో ఎలాంటి వివాదాలు ఇప్పటి వరకు లేవన్న ఆయన.. రాహుల్పై ఇప్పుడు కక్షకు ప్రసంగంలో అదానీ ఆస్తుల మీద చేసిన వ్యాఖ్యలే కారణం అన్నారు. అదానీపై రాహుల్ ప్రసంగాలను తొలగించటం చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. మమత బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్ వంటి సీఎంలు తలచుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయగలరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాహుల్ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కేవీపీ రామచంద్రరావు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?