Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kvp Ramachandra Rao Fires On Opposition Parties

KVP Ramachandra Rao: రాహుల్‌ ని దేశద్రోహిగా చిత్రీకరించడం దారుణం

Published Date :March 28, 2023 , 5:08 pm
By NTV WebDesk
KVP Ramachandra Rao: రాహుల్‌ ని దేశద్రోహిగా చిత్రీకరించడం దారుణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాహుల్ గాంధీ విషయంలో ఏపిలోని పార్టీల తీరుని తప్పుబట్టారు కేవీపీ రామచంద్రరావు. రాహుల్ ఎపిసోడులో ఏపీలోని ప్రధాన పార్టీల మౌనంపై కేవీపీ ఆగ్రహం చెందారు. చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కేవీపీ సూచించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీ స్పందించడం లేదన్నారు కేవీపీ.రాహుల్ విషయంలో బీజేపీ కుట్రలను తప్పు పడుతూ ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా స్పందించ లేదు.పార్లమెంటులో ప్రజాస్వామ్యం హత్య జరిగితే ఒక్క ఎంపీనైనా స్పందించరా..?అధికార పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నా స్పందించ లేదు.అధికార పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో సైలెంట్ అయ్యారు.ప్రజాస్వామ్యాన్ని అత్యంత మిన్నగా గౌరవించే వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నేత.1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పెద్ద ఎత్తున పోరాటం చేశారు.మోడీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తామని చంద్రబాబు 2002లో ప్రకటించిన ధీశాలి.. ఈయనా మౌనంగానే ఉన్నారు.ఇక ప్రశ్నించడానికే పుట్టిన జనసేనాని.. బీజేపీ నేతలను అంతర్గతంగానైనా ప్రశ్నించాలి.మూ చంద్రబాబు ఓ రకంగా మిత్రపక్షాలమే.

Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

2018 ఎన్నికల్లో తెలంగాణలో మేం కలిసి పని చేశాం.2019లో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్, మన్మోహన్ సింగ్ వంయి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెళ్లి సంఘీభావం తెలిపారు.సరైన కారణానికి సంఘీభావం తెలపకుంటే.. రేపటి రోజు ఆ హక్కులను మీరు కొల్పోతారు.ఇది వైసీపీకి, టీడీపీకి, జనసేనకు వర్తిస్తుంది.ఏపీ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధైనా సంఘీభావం ప్రకటించకపోవడం కరెక్ట్ కాదు.బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసే వాళ్లను ఈ ప్రభుత్వం అణిచివేయకూడదు.చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలి.రేపటి రోజు మనకేదెన్నా జరిగితే మనల్ని పట్టించుకునే వాడు ఉండడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేవీపీ.

రాహుల్ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది.రాహులును మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.రాహుల్ పై భౌతిక దాడులు తప్ప మోడీ ప్రభుత్వం అన్ని రకాల వేధింపులకు గురి చేస్తోంది.రాహుల్ లండన్లో భారత దేశాన్ని అవమానించారనే విమర్శలు చేశారు.భారత దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాన్ని మోడీ అవమానిస్తోంది.అదానీ గురించి రాహుల్ ప్రశ్నించగానే ఇబ్బంది పెట్టడం ఎక్కువైంది.రాహుల్ క్షమాపణలుకకర చెప్పాలంటూ సభను జరగనివ్వలేదు.అధికార పార్టీ సభ్యులే సభను జరగనివ్వకపోవడం ఇదే తొలిసారి.ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేకున్నా.. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తప్పించారు.

ఇక భారత దేశ సార్వభౌధికారానికి అర్థమేంటీ..?అదానీ వ్యవహరంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోడీని విమర్శిస్తే ఓబీసీలను అవమానించారని ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు. మోడీ అంటే బీసీలేనా.. పార్శీలు ఉన్నారు.. ముస్లింలు ఉన్నారు.. జైన్, మార్వాడీలు ఇలా చాలా సామాజిక వర్గాలు వాళ్లున్నారు.కేవలం బీసీలనే రాహుల్ విమర్శించారంటూ నడ్డా లాంటి వాళ్లు కూడా మాట్లాడ్డడం సరికాదు.దక్షిణాది భారతీయుల, బెంగాలీల మనోభావాలను దెబ్బ తీశారని మోడీపై కేసు పెడితే అనర్హులుగా ప్రకటించేస్తారా..?రాహులును మాట్లానివ్వకుండా ఉండేందుకే బీజేపీ కుట్ర. రాహుల్ కు అండగా పార్టీలన్నీ ఏకతాటి మీదకు వస్తున్నాయి.. జాతీయ ఉద్యమంగా మారుతోంది. రాహులును దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు.

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి చంద్రబాబు కలిసి రావాలి.అవసరమైతే చంద్రబాబుని కలవడానికి అభ్యంతరం ఏంలేదు.గత ఎన్నికల సమయంలో మా నాయకుడు అశోక్ గెహ్లత్ చంద్రబాబును కలిశారు.ఇప్పుడు రాహులుకు సంఘీభావం తెలపాలని కోరినట్టే పోలవరం విషయంలో కూడా చేతులు జోడించి సహకరించాలని పార్టీలను కోరాను.

Read Also: Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • disqulaify
  • ex mp kvp
  • kvp
  • modi

తాజావార్తలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions