Bandi Ramesh: కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు బాండ్ పేపర్ రాయడానికి కూడా రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Ramesh: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ నాలుగో ఫేస్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందని, మీకు కూడా దమ్ము, ధైర్యం వుంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ 6గ్యారంటీలకు బాండ్ పేపర్ రాస్తామని, శివుడి ముందు వుంచి 6 గ్యారంటీలకు దేవుని ముందు వుంచి ప్రమాణం చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇవన్నీ చేయడానికి దైర్యం కావాలని.. మేము చేసేదే చెప్తామన్నారు. పదేళ్లలో కూకట్పల్లికి ఒక్క కాలేజ్ అయినా వచ్చిందా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను ఆయన అభ్యర్ధించారు. గొట్టుముక్కల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. బండి రమేష్ బాగా చదువుకున్న వ్యక్తి , సౌమ్యుడు, 16 గంటలు ప్రజలకు సేవ చేస్తారని, ఆయనకు అందరూ ఓటువేసి గెలిపించాలని అన్నారు.. ఈ సమావేశంలో బండి రమేష్ సతీమణి లకుమాదేవి, రాజేష్ గౌడ్, నేతి శ్రీధర్, శ్యామ్ సుందర్ ,అందే శ్రీరామ్మూర్తి , బాలాజీ, దినేష్ పాల్గొన్నారు.
Read Also: Revanth Reddy: పటాన్చెరులో పదేళ్లుగా బీఆర్ఎస్ రౌడీయిజం నడుస్తోంది..
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
అనంతరం కేపీహెచ్బీలోని ఇండిస్ వన్ సిటీ, లోదా మెరిడియన్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ‘మార్పుమొదలైంది.. మీ తీర్పుమిగిలింది..’ కార్యక్రమంలో బండి రమేష్ పాల్గొన్నారు. మా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని.. బండి రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని రెసిడెంట్స్ వెల్ఫేర్ సభ్యులు తెలిపారు, ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ లోదా, వన్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సభ్యులు తనకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. తాను గెలిచిన అనంతరం కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను, అసోసియేషన్కు సంబందించిన ఎలాంటివి అయినా తీరుస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటానని అన్నారు.
తాజావార్తలు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!