Formula E- Race Case: లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్..
- మా లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్ మోహిత్ రావు
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు- మోహిత్ రావు
- ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంది- మోహిత్ రావు
- సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాం- సోమ భరత్ కుమార్
- ముందస్తు బెయిల్కు వెళ్లే విషయంలో ఇంకా ఆలోచన చేయలేదు- సోమ భరత్ కుమార్.
తమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నట్లు కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని చెప్పారు. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపిందని అన్నారు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు.. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించామని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలని అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు.
Read Also: TG Exams: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..
Also Read
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
మరోవైపు.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇంఛార్జ్ సోమ భరత్ కూమార్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కొన్ని మీడియా ఛానెల్స్ వక్రీకరించడం దురదృష్టకరం అని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ- రేస్ను హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ హయంలో నిర్వహించారని అన్నారు. ఇందులో అవినీతి జరిగిందని కేటీఆర్ పైన ఈ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.. చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాం.. ముందస్తు బెయిల్కు వెళ్లే విషయంలో ఇంకా ఆలోచన చేయలేదని అన్నారు. ఒకవేళ ముందస్తు బెయిల్ కోసం వెళితే చెబుతాం.. ముందస్తు బెయిల్ తీసుకోవచ్చని చట్టంలోనే ఉంది.. అలా వెళ్లినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని సోమ భరత్ కుమార్ అన్నారు.
Read Also: BJP On Rahul Gandhi: కాంగ్రెస్ నీచ వైఖరి బయటపడింది.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
ఈరోజు ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముఖుల్ రోహిత్గి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. “విచారణ ప్రాథమిక దశలోనే ఉంది.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం.. ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా..” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో.. పిటిషన్ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో