KTR: రేవంత్రెడ్డి మరో ఏక్నాథ్ షిండే..! ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ktr hot comments: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల (సిరిసిల్ల పట్టణ తెలంగాణ భవన్) లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీకి ఎంత గౌరవం ఇచ్చామో అందరికి తెలుసు.. మనకు ఏం చేయలేదనే 2021 నుంచి మన కేసీఆర్ తెలంగాణ వచ్చినపుడు వెళ్ళలేదన్నారు. భారత దేశంలో తెలంగాణ నంబర్ వన్ లాగా ఉండేది.. దేశంలోనే అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని అనుకరించేవాల్లు అని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.. మోడీనీ బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు(బడే భాయ్ చోట భాయ్).. నాలుగు నెలల క్రితం గుజరాత్ ను కించపరిచిన రేవంత్ నిన్న మోడీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అని అన్నారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
Read Also: Gummanur Jayaram: టీడీపీ చేరిన మంత్రి జయరాం.. తొలి స్పందన ఇలా..
Also Read
ఇక, వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే లాగా మారి బీజీపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ అని కేటీఆర్ అన్నారు. ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చాడు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లో వంద భాగాలు ఉన్నాయి.. మూడు బ్యారేజీలు ఉన్నాయి.. 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి.. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి.. వాటిని ఆపాలని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఎల్లుండి వస్తున్న రేవంత్ రెడ్డి వచ్చి సిరిసిల్ల డెవలప్మెంట్స్ ను చూసి పో.. నేత కార్మికుల గురించి కేకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పండి అన్నారు. వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నలను ఆదుకోండి.. సిగ్గు లేని లక్షణం రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Vande Bharat Trains: 4 వందేభారత్ ట్రైన్లపై రాళ్ల దాడి.. కర్ణాటక, ఏపీలో ఘటనలు..
అయితే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా.. ఉద్యోగాలు అన్ని కేసీఆర్ ఇచ్చినవే అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాల మీద పొంగు లాంటిదే.. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కు 50 వెయిళ మెజార్టీ తో గెలిపించాలి అని కోరారు. బండి సంజయ్ చేసిన గొప్పని ఏమన్న చేసిండా అంటే అమిత్ షా చెప్పులు మోయడంమేనా.. దేశ స్థాయిలో బండి సంజయ్ ఇజ్జత్ మొత్తం తిసిండు.. దేవుణ్ణి అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు బండి అని విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాకా ఉధ్యోగాలు ఇవ్వలేదు.. ఎల్లుండి సీఎం వస్తున్న రేవంత్ రెడ్డికి 3 డిమాండ్లను చేస్తున్నాను.. 1. నేత కార్మికులకు క్షమాపణ చెప్ప బతుకమ్మ చిరెల ఆర్డర్ ఇవ్వాలి.. 2. వర్కర్ టూ ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలి.. 3. మల్కపేట రిజర్వాయర్ పూర్తి అయ్యింది వెంటనే ప్రారంభించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!