Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ktr Severely Criticized The Congress Government

KTR: కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది..

Published Date :February 25, 2025 , 4:13 pm
By Rajesh Veeramalla
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
  • హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది- కేటీఆర్
  • రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది- కేటీఆర్.
KTR: కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ భ‌వ‌న్‌లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన మాజీ జ‌డ్పిటీసీ కీర్తి వెంక‌టేశ్వర్లు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి.. 15 నెల‌ల కాలంలోనే అధికార పార్టీని వ‌దిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. కాంగ్రెస్ పాల‌న ఏ రకంగా ఉందో చెప్పొచ్చని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లోనూ ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. 15 నెల‌ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజ‌ల‌కు కోపం వ‌స్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Viral News: సినిమా థియేటర్‌లో ఫ్రీ పాప్‌కార్న్.. ఏకంగా డ్రమ్ము నిండా తీసుకెళ్లిన వ్యక్తి ( వీడియో)

గ‌త 48 గంట‌ల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహ‌త్య చేసుకున్నారు.. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారని కేటీఆర్ అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్రచారంలో బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ ఎన్నిక‌తో గ‌వ‌ర్నమెంట్ మారుతుందా.. త‌ల‌కిందులు అవుతుందా..? అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్సీ ప్రచారం కోసం హెలికాప్టర్‌లో పోయి సిద్విలాసంగా మాట్లాడుతున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒకవైపు.. రైతుల ఆత్మహ‌త్యలు, 8 మంది కార్మికులు ఇరుక్కుపోతే.. సోయి లేకుండా గాల్లో చ‌క్కర్లు కొడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే మళ్లీ తాజాగా 36వ సారి ఢిల్లీకి పోయిండు.. 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం పీకారు.. 36వ సారి పోయి పీకేదేంది అంటూ ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు

36వ సార్లు ఢిల్లీకి వెళ్లి క‌నీసం మంత్రివ‌ర్గ విస్తరణ‌ కూడా చేసుకోలేక‌పోతున్నాడు.. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేడు.. మంత్రుల‌ను నియ‌మించుకోలేని అస‌మ‌ర్థ సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను, ఆయ‌న ఆన‌వాళ్లను మాయం చేస్తానని అంటున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. తెల్లారిలేస్తే కేసీఆర్ జ‌పం చేయ‌ని రోజు ఉండ‌దు.. నిద్రలో కూడా కేసీఆరే యాదికి వ‌స్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ద‌గ్గరి దోస్తుల‌కు ఇలా చెప్పుకున్నాడు.. మ‌నం గెలుస్తలేం.. ప్రతిప‌క్షంలో ఉండి గ‌ట్టిగా కొట్లాడాలి.. కేసీఆర్ ఉన్నన్ని రోజుల గెలువం అని చెప్పుకున్నాడు.. కానీ ప్రజ‌లు ల‌క్కీలాట‌రీలో రేవంత్ రెడ్డిని గెలిపించార‌ని కేటీఆర్ తెలిపారు. లక్ష రూపాయలు కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ఆడపిల్లల మనసు కొల్లగొట్టాడని కేటీఆర్ అన్నారు. రైతన్నలను కూడా అదే విధంగా మోసం చేశాడు.. కేసీఆర్ బిచ్చమేసినట్లు 10 వేలు ఇస్తే, తాను 15 వేలు ఇస్తానని.. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే, తాను 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది.. రోజుకు ఒక్కరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs vs congress
  • CM Revanth Reddy
  • Congress government
  • ktr
  • Political criticism

తాజావార్తలు

  • Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!

  • SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

  • Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్‌తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions