KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే ఖర్మ బీఆర్ఎస్ కు లేదు.. గతంలో లేదు.. ఇప్పుడు ఉండదన్నారు. తమ చెల్లెలిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు.. అలాంటి బీజేపీతో తాము కలుస్తామా? అని అన్నారు.
Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డో…ఇంకో దివాణో ఇంకేదో మాట్లాడితే మీరు ఆగం కావొద్దని సూచించారు. తాను రేవంత్ రెడ్డిని దివాణే అంటున్నానన్నారు. రేవంత్ రెడ్డిని లంగా, దొంగ, లుచ్చగాడు అని తాను అనలేదన్నారు. గిటువంటి లత్కోర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. బూతులు మాట్లాడుడు కాదు కదా పరిపాలన అంటే.. తాము పరిపాలన బాగా చేశాం కనుకనే హైదరాబాద్ లో 16 సీట్లు వచ్చాయన్నారు. మీ ఎమ్మెల్యేకు తోడు ఎంపీని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
హైదరాబాద్ లో మళ్లీ కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మోసం చేసిండు.. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని చెప్పి మరి మోసం చేసిండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని విమర్శించారు. ఒకరు చేవెళ్ల, ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారు.. కానీ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని అన్నారు. మిమ్మల్ని కోరెదొక్కటే.. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండని కోరారు. మళ్లీ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!