KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే ఖర్మ బీఆర్ఎస్ కు లేదు.. గతంలో లేదు.. ఇప్పుడు ఉండదన్నారు. తమ చెల్లెలిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు.. అలాంటి బీజేపీతో తాము కలుస్తామా? అని అన్నారు.
Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- Special Trains: పండుగ సీజ్లో రైల్వేశాఖ గుడ్న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డో…ఇంకో దివాణో ఇంకేదో మాట్లాడితే మీరు ఆగం కావొద్దని సూచించారు. తాను రేవంత్ రెడ్డిని దివాణే అంటున్నానన్నారు. రేవంత్ రెడ్డిని లంగా, దొంగ, లుచ్చగాడు అని తాను అనలేదన్నారు. గిటువంటి లత్కోర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. బూతులు మాట్లాడుడు కాదు కదా పరిపాలన అంటే.. తాము పరిపాలన బాగా చేశాం కనుకనే హైదరాబాద్ లో 16 సీట్లు వచ్చాయన్నారు. మీ ఎమ్మెల్యేకు తోడు ఎంపీని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
హైదరాబాద్ లో మళ్లీ కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మోసం చేసిండు.. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని చెప్పి మరి మోసం చేసిండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని విమర్శించారు. ఒకరు చేవెళ్ల, ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారు.. కానీ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని అన్నారు. మిమ్మల్ని కోరెదొక్కటే.. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండని కోరారు. మళ్లీ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
Special Trains: పండుగ సీజ్లో రైల్వేశాఖ గుడ్న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!