KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే ఖర్మ బీఆర్ఎస్ కు లేదు.. గతంలో లేదు.. ఇప్పుడు ఉండదన్నారు. తమ చెల్లెలిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు.. అలాంటి బీజేపీతో తాము కలుస్తామా? అని అన్నారు.
Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డో…ఇంకో దివాణో ఇంకేదో మాట్లాడితే మీరు ఆగం కావొద్దని సూచించారు. తాను రేవంత్ రెడ్డిని దివాణే అంటున్నానన్నారు. రేవంత్ రెడ్డిని లంగా, దొంగ, లుచ్చగాడు అని తాను అనలేదన్నారు. గిటువంటి లత్కోర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. బూతులు మాట్లాడుడు కాదు కదా పరిపాలన అంటే.. తాము పరిపాలన బాగా చేశాం కనుకనే హైదరాబాద్ లో 16 సీట్లు వచ్చాయన్నారు. మీ ఎమ్మెల్యేకు తోడు ఎంపీని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
హైదరాబాద్ లో మళ్లీ కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మోసం చేసిండు.. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని చెప్పి మరి మోసం చేసిండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని విమర్శించారు. ఒకరు చేవెళ్ల, ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారు.. కానీ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని అన్నారు. మిమ్మల్ని కోరెదొక్కటే.. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండని కోరారు. మళ్లీ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!