KTR : కాంగ్రెస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ గుట్టు రట్టు చేసిన కేటీఆర్
- సీఎం రేవంత్ రెడ్డి రహస్య భేటీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- రైతుల సమస్యలు పక్కన పెట్టి చీకటి ఒప్పందాలంటూ కేటీఆర్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో సమావేశాలు పెట్టడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇంత చిల్లర రాజకీయం ఇప్పటి వరకు చూడలేదని విమర్శించిన కేటీఆర్, ఒకవైపు బహిరంగంగా బీజేపీని ఎదుర్కొంటున్నట్టు నటిస్తూ, మరోవైపు దొంగచాటుగా ఒప్పందాలు చేసుకోవడం అనైతికమని ఆరోపించారు. బీజేపీతో సమావేశాలు పెట్టిన ముఖ్యమంత్రి, దానికి సంబంధించి నిజాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
“రైతులు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమస్యలపై సమీక్షలు నిర్వహించే తీరిక లేకుండా, రహస్య రాజకీయ ఒప్పందాలకే సమయం దొరకడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం,” అని కేటీఆర్ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని అంటుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై స్పందించి రేవంత్పై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
“ప్రజలకు సమాధానం చెప్పలేక, బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ, రాజకీయ సమీకరణాలు మార్చుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈ చీకటి రాజకీయాలను సహించబోరు. రాష్ట్రాన్ని వృద్ధిలో నిలిపి, గందరగోళం సృష్టించే ఈ రాబందు రాజకీయాలకు త్వరలోనే సమాధానం చెబుతారు,” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్..
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..