OTR: ఓ మంత్రి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కలిసి హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వే ఎందుకు చేశారు? పైగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఎందుకు జాయిన్ అయ్యారు? ఆ టూర్ వివరాలను టాప్ సీక్రెట్గా ఎందుకు ఉంచారు? ఎవరా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులు? ఎక్కడ జరిగిందా ఏరియల్ సర్వే? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్…
Ambati Rambabu: నా ఇంటిపై సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే దాదాపుగా 7 గంటల పాటు జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బొత్స సత్యనారాయణ, రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు అనేకసార్లు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ ఎత్తలేదు.
Kiren Rijiju: రాహుల్ గాంధీ భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారారని, లోక్సభ ప్రతిపక్ష నాయకులు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని, మావోయిస్టులు, తీవ్రవాదుల్ని కలుస్తున్నారని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.
Mani Shankar Aiyar: కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్…
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం. Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్! శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే…
BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు. చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో…
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా…
Javed Akhtar: బీహార్లో ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందిస్తూ, సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం యువతి ‘‘హిజాబ్’’ను లాగడం వివాదాస్పదం అయింది. దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, తలతో దిష్టి తీసే సీన్తో పాటు, హెలికాప్టర్ ఫ్యాన్ను త్రిశూలంతో తిప్పే సీన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read:Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3…
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ప్రక్రియపై బుధవారం పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర వాడీవేడి చర్చ జరిగింది. అయితే, దీనిపై గురువారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమిత్ షాను ఉద్దేశిస్తూ, బీజేపీ నాయకుడు ‘‘ఒత్తిడి’’లో ఉన్నట్లు కనిపించారని అన్నారు. ‘‘నిన్న పార్లమెంట్లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన చేతులు…