Off The Record: పొలిటికల్ లీడర్స్కు సన్స్ట్రోక్స్ కామన్. కానీ… టీడీపీ సీనియర్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మాత్రం సన్ఇన్లా స్ట్రోక్ బాగా…. గట్టిగా తగులుతోందట. మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన ఎంపీ పుట్టా మహేష్ యనమలకు స్వయానా అల్లుడు. అందుకే… ఆ ఎఫెక్ట్ ఎక్కడ తన అవకాశాన్ని దెబ్బ కొడుతుందోనని కంగారు పడుతున్నారట సీనియర్. పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్పై టీడీపీ అధిష్టానం బాగా సీరియస్గా ఉంది. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు…
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలకు రాజకీయం ప్రవృత్తి మాత్రమే. అధికారంలో ఉన్నా ,లేకపోయినా నో మేటర్. వ్యాపార ప్రయోజనాలే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ. అయితే… ఆ వ్యాపారాలు నేరుగా ప్రజలను ప్రభావితం చేసేవి కాకపోవడంతో ఇన్నాళ్ళు పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. కానీ… ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ఎమ్మెల్యేలు డైరెక్ట్ అయిపోయారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వైన్, మైన్, ల్యాండ్….ఇతరత్రా ఏ డీల్ అయినాసరే….. ఇప్పుడంతా…
Off The Record: కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా, రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్లోనే ఉన్న ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా… ఉన్నట్టుండి వాళ్లు యాక్టివిటీ పెంచడం వెనకున్న రీజన్ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను. ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే…
OTR: ఓ మంత్రి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కలిసి హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వే ఎందుకు చేశారు? పైగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఎందుకు జాయిన్ అయ్యారు? ఆ టూర్ వివరాలను టాప్ సీక్రెట్గా ఎందుకు ఉంచారు? ఎవరా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులు? ఎక్కడ జరిగిందా ఏరియల్ సర్వే? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్…
Ambati Rambabu: నా ఇంటిపై సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే దాదాపుగా 7 గంటల పాటు జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బొత్స సత్యనారాయణ, రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు అనేకసార్లు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ ఎత్తలేదు.
Kiren Rijiju: రాహుల్ గాంధీ భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారారని, లోక్సభ ప్రతిపక్ష నాయకులు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని, మావోయిస్టులు, తీవ్రవాదుల్ని కలుస్తున్నారని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.
Mani Shankar Aiyar: కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఎవరూ అక్కర లేదు, వాళ్ల పార్టీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఖతం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరసలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పారేశాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల్లు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్…
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం. Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్! శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే…
BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు. చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో…
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా…