Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం..
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు. ఏ సబ్ స్టేషన్ అయినా పోదాం.. 8 నుంచి 12 గంటల కరెంట్ ఇచ్చినట్టు లాక్ బుక్ లో ఉంది.. మేము చెక్ చేసిన తర్వాత లాక్ బుక్ లేకుండా చేశారు వాళ్ళు.. 24 గంల కరెంట్ ఇస్తే లాక్ బుక్ ఎందుకు తీసేశారు అని ఆయన ప్రశ్నించారు. పిక్ అవర్ లో 16 గంటలు ఇచ్చారు.. కరెంట్ వస్తుందో లేదో తీగలు పట్టుకోండి గతంలో కేటీఆర్ అన్నారు.. సిరిసిల్లలోనే పెట్టుకుందాం అంటే కాంగ్రెస్ వాళ్లు పట్టుకోండి దరిద్రం పోతుంది అన్నారు కేటీఆర్.. ఈ విద్యుత్ రంగం నుంచి జగదీష్ రెడ్డికి 10 వేల కోట్ల రూపాయలు తిన్నాడు.. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది.. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారు.. ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ ది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
Read Also: CM Revanth: ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే..
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
బీఆర్ఎస్ కు ప్రభాకర్ రావు దోచి పెట్టాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు వచ్చి ఏదేదో చెప్తున్నారు.. తిన్నది అంతా కక్కిస్తాం.. ఎవరిని వదిలేదు.. దొంగలు అనగానే బీఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.. 24 గంటలు కరెంట్ అనేది మభ్య పెట్టడమే.. లాక్ బుక్ బయట పెట్టండి అని ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎంత తిన్నారో అంతా కక్కిస్తాం.. సీఎంని విచారణ చేయాలని కోరుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.
Read Also: Bigg Boss : భార్యాభర్తల మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్.. విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు?
ఇక, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఎటాక్ కు దిగారు. విద్యుత్ శాఖలో అవినీతి జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని జగదీష్ రెడ్డి కోరారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు విచారణ జరిపించాలి.. దోషులకు శిక్ష పడాలి.. ఒక వేళ తప్పు చేసినట్లు ఆరోపణలు నిజం అయతే వారికి శిక్ష పడాలి.. పనికి మాలిన మాటలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డివి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవ శ్వేత పత్రం విడుదల చేశారు.. మంత్రులు అందరూ కలిసి మాట్లాడి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారో చెప్పండి.. ఒక్క రోజు అయిన గతంలో విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్ల కార్డులు పట్టుకునే అవకాశం వచ్చిందా?.. అప్పుల అందరికీ ఉన్నాయి.. ఆస్తులు కూడా ఉన్నాయి.. అప్పులు ఉన్నాయంటే తప్పు చేసినట్టే నా?.. చేసిన అప్పుతోనే అభివృద్ధి చేశామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!