Kolkata Doctor case: రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు
- కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై హైకోర్టు కీలక నిర్ణయం
- సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం ప్రకటన
- రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్కతా చేరుకోనుంది. తొలుత ఆర్జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
గత శుక్రవారం ఉదయం డాక్టర్ సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా శవమై పడి ఉంది. ఆమె బట్టలు చిందరవందరగా, ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. అయినా కూడా ఆసుపత్రి ప్రతిస్పందనలో తీవ్రమైన లోపాలను కోర్టు గుర్తించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరడంతో సీబీఐకి అప్పగించింది.
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆధీనంలోని కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్పై న్యాయస్థానం తీవ్రంగా విరుచుకుపడింది. ప్రిన్సిపాల్ ‘ప్రోయాక్టివ్’ గా లేకపోవడం నిరుత్సాహపరుస్తుందని వ్యాఖ్యానించింది. మాజీ ప్రిన్సిపల్కు రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత మరో కళాశాలలో అదే పాత్రను అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. వెంటనే అతనిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని ధర్మాసనం ఆదేశించింది. హత్యాచార ఘటన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన అవమానాన్ని భరించలేనని డాక్టర్ ఘోష్ రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత అతనికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా కొత్త పోస్టు ఇచ్చారు.
వైద్యురాలు హత్యాచారానికి గురైతే.. కుటుంబ సభ్యులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారని కోర్టు నిలదీసింది. ఇక ఈ కేసులో ప్రిన్సిపాల్ స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని నిలదీసింది. అతడిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించింది. ఇందులో ఏదో తప్పు ఉందని కోర్టు పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే కేసును ఆదివారంలోపు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. మంగళవారం అనూహ్యంగా కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!