Kishan Reddy : ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడినుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్మల్కు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. జీవో 220కి వ్యతిరేకంగా.. స్థానిక ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితోపాటు నిర్మల్ జిల్లా యువత, రైతులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. మీ కృషి కారణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మహేశ్వర్ రెడ్డి ధైర్యంగా నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించేందుకు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు
Also Read : Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
అంతేకాకుండా.. ‘నిర్మల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూమిని.. ఎమ్మెల్యే కుటుంబసభ్యుల భూ వ్యాపారానికి కావాల్నా? ఇదెక్కడి న్యాయం. నిర్మల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నరని.. కొన్నిరోజులు వెనక్కు తీసుకున్నట్లు నాటకాలాడి మళ్లీ.. తెరపైకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు మన ప్రభుత్వం మరోసారి రాదని అర్థం కావడంతోనే ఆదరబాదరాగా ఈ జీవోను తీసుకొచ్చి ఆర్థికంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే సమస్య ఉంది. అధికార పార్టీ నాయకుల అక్రమ భూదంధాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ భూములు, గ్రామ కమతాలు.. ఇట్లా ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారు. ధరణి పోర్టల్ లో అక్రమంగా ఇలాంటి భూములను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ధరణి పోర్టల్ ప్రజలకు గుదిబండగా మారింది. ధరణి కారణంగా అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబం చేసిన హత్యలే. కేసీఆర్ కుట్రపూరిత ఆలోచనలతోనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!