Kishan Reddy: మోడీ నాయకత్వంలో అభివృద్ధి బాటలో ఇండియన్ రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందింది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి.. 2014కి- 2023కి రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగింది.. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసింది.. 122కిలోమీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించింది.. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Shilpa Shetty: శిల్పాశెట్టి కంపెనీ ఐపీఓకు వస్తోంది.. పెట్టుబడి పెట్టి సంపాదించుకునేందుకు రెడియా?
Also Read
2వేలకు పైగా రైల్వే లైన్స్ కోసం తెలంగాణలో సర్వేలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేస్తున్నాం.. హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ ను 3 వందల కోట్లతో నిర్మించబోతున్నామని అన్నారు. సికింద్రాబాద్ లో అభివృద్ధి పనుల కోసం 7వందల కోట్లు కేంద్రం ఇచ్చింది.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024 లోపు పూర్తి చేస్తాం.. దానికి 2వందల కోట్లు కేంద్రం ఇచ్చింది అని కేంద్రమంత్రి అన్నారు. 3 వందల కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతుంది కేంద్రం.. రైల్వే మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ లో దశల వారిగా అభివృద్ధి నిర్ణయాలు ఉంటాయన్నారు.
Read Also: Rithu Chowdary : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..
కాజీపేట రైల్వే మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ లో 3వేల మందికి ఉపాధి లభించనుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యంత సేఫ్ జర్నీ రైల్వే ప్రయాణం.. 25 వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు మోడీ ప్రారంభిస్తారు అన్నారు. 26వేల కోట్లతో RRR రోడ్డు కేంద్రం పరిధిలో పనులు ప్రారంభించింది.. ట్రిపుల్ ఆర్ పరిధిలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా రాబోతుంది.. ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది.. RRR నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం కేంద్రానికి లేదు.. భూ సేకరణలో కేంద్రం పాలుపంచుకొని సగం నిధులు ఇస్తానని ముందుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయడం లేదు అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!