Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Kishan Reddy Said That Amit Shah Is Coming To Telangana On 27th

Kishan Reddy: వారి తప్పుడు విధానాల వల్లే రైతులకు మేలు జరగడం లేదు

Published Date :August 24, 2023 , 8:42 pm
By NTV WebDesk
Kishan Reddy: వారి తప్పుడు విధానాల వల్లే రైతులకు మేలు జరగడం లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈనెల 27 రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగే రైతు సభలో అమిత షా మాట్లాడుతారు అని ఆయన పేర్కొన్నారు. రైతు ఘోషా, బీజేపీ బరోసా పేరుతో ఖమ్మంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు భీమా అందడం లేదు.. ప్రభుత్వ నిర్లక్షం వల్ల లక్షల కోట్లు నష్టపోతున్నారు.. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ రైతులను మోసం చేశారు.. కేసీఆర్ మరో సారి రైతులను మోసం చేసేందుకు ప్రయతం చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు.

Read Also: Chandrayaan-3: ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే.. ఆ తర్వాత విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్ ఏమవుతాయి?

రైతు రుణాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలను కేసీఆర్ చేస్తున్నాడు.. రైతులు అసంతృప్తితో ఉన్నారు.. దేశంలో అనేక రాష్ట్రంలో సబ్సిడీ పద్దతి కొనసాగుతోంది.. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం 26 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.. లక్షలాది మంది కౌలు రైతులు నష్టపోతున్నారు.. రైతు సమస్యలపై ఖమ్మంలో రైతు సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభలో అమిత్ షా రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు.. అమిత్ షా డిల్లీ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి భద్రాచలం వచ్చి రాములోరిని దర్శించుకొని ఖమ్మం వస్తారు అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: Indraja: ఇంద్రజ కూతురును చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కానీ… ?

బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నామో స్పష్టమైన క్లారిటీ ఇవ్వబోతున్నామని కిషన్ రెడ్డి అన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశం గర్వపడింది.. జాతీయ ఆవార్డులలో తెలుగు సినిమాలకు అవార్డులు రావడం హర్షం వ్యక్తం చేస్తున్నా .. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కు అభినందనలు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.. అంతర్జాతీయంగా డబ్బింగ్ చేయబడి ప్రజాదరణ పొందిన సినిమా పుష్ప.. ఈ చిత్ర యూనిట్ కు హృదయపూర్వక అభినందనలను ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుతో పాటు జాతీయ చలన చిత్ర అవార్డులతో సత్తా చాటింది.. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు.. ఉత్తమ స్టంట్, ఉత్తమ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ లకు అవార్డులు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.

Read Also: 69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్‌ సహా ఎవ్వరినీ వదలని పవన్‌..

కేసీఆర్ కుటుంబం నేల విడిచి సాము చేస్తోంది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు పాల్పాడుతోంది.. మహిళా రిజర్వేషన్ పై కేసీఆర్ కుటుంబానికి మాట్లాడే నైతిక హక్కు లేదు.. మొదట కేసీఆర్ పాలనలో మహిళలు లేకుండా పరిపాలన చేశారు.. మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెడితే అడ్డుకున్న నేతలను కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలుచుకోని వింధులు ఏర్పాటు చేశాడు.. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులతో ఏడు మంది మహిళకు స్థానం కల్పించి రిజర్వేషన్ గురించి మాట్లాడుతారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ఆడ బిడ్డలను అన్యాయం, అవమానించే విధంగా కేసీఆర్ పాలన ఉంది.. 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఏడు మంది మహిళలకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే… ఎవరికి ఓటేసిన ఒకటేనని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • bjp sabha
  • khammam
  • Kishan Reddy
  • telangana

తాజావార్తలు

  • Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

  • Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

  • Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions