Kishan Reddy: హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
నివురుగప్పిన నిప్పులా యువత అసంతృప్తితో రగిలిపోతున్నారు అని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.. డిసెంబర్ 3వ తేదీ తర్వాత అధికారంలోకి వచ్చినట్లు ఊహాలోకంలో విహరిస్తున్నారు.. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో ఓడిపోవడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆరాటం ఉంటే TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదు? అని ప్రశ్నించారు. ప్రజల ఓట్లు అడిగే ముందు తగిన సంజాయిషీ ఇవ్వాలి.. ఉద్యోగ నియామకాలు జరపకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయపన చేసింది అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read also: Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
బీఆర్ఎస్ అభ్యర్థులు జనాల్లో జవాబు చెప్పలేక వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. TSPSC ని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నారు.. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి.. ఆస్తులు అమ్మి హైదరాబాద్ వచ్చిన TSPSC అభ్యర్థుల పరిస్థితి.. ఆవేదన, తపన సీఎం కుటుంబానికి తెలియదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున ప్రవళిక ఆత్మహత్యను కప్పిపుచ్చుకున్నా.. పాపం మాత్రం కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ బీజేపీ చీఫ్ ధ్వజమెత్తాడు. మెట్ పల్లికి చెందిన రెహామత్ గ్రూప్స్ పరీక్ష వాయిదా పడితే ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు.. TSPSC నియామక పరీక్షలను అనేక సార్లు రద్దు చేసిన రికార్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Priyanka Gandhi: సబ్సిడీ సిలిండర్లు, రుణమాఫీ, ఉచిత కరెంట్.. ఛత్తీస్గఢ్లో ప్రియాంక హామీ
కొలువుల కోసం కొట్లడితే నిరుద్యోగులకు నిరాశే మిగిలింది అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అత్యధికంగా నిరుద్యోగులు 16 శాతం ఉన్నారు.. ఒక్క గ్రూప్-1 పోస్ట్ కూడా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు.. ఒక్క టీచర్ పోస్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీలప్ చేయలేదు.. నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది.. యూనివర్సిటీల్లో చాలా విభాగాలు మూత పడ్డాయి.. విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది అని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల పట్ల విశ్వాసం కోల్పోయారు.. రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు.. మోసం చేయడం కేసీఆర్ ప్రభుత్వ నైజం అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: World Cup 2023: ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతినెలా చివరివారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామో.. అదే తరహాలో ఉద్యోగ ఖాళీలు రాష్ట్రంలో భర్తీ చేస్తాం.. ఉపాధి పరంగా అన్ని రకాల వృత్తులను ప్రోత్సహిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
- Tags
- BRS
- cm kcr
- Kishan Reddy
- telangana
- tspsc
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!