Kishan Reddy: హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివురుగప్పిన నిప్పులా యువత అసంతృప్తితో రగిలిపోతున్నారు అని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.. డిసెంబర్ 3వ తేదీ తర్వాత అధికారంలోకి వచ్చినట్లు ఊహాలోకంలో విహరిస్తున్నారు.. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో ఓడిపోవడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆరాటం ఉంటే TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదు? అని ప్రశ్నించారు. ప్రజల ఓట్లు అడిగే ముందు తగిన సంజాయిషీ ఇవ్వాలి.. ఉద్యోగ నియామకాలు జరపకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయపన చేసింది అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read also: Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. నకిలీ PMO కేసులో ట్విస్ట్.. ‘ఆఫర్ లెటర్, ఐడీ ఇచ్చారు’!
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
బీఆర్ఎస్ అభ్యర్థులు జనాల్లో జవాబు చెప్పలేక వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. TSPSC ని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నారు.. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి.. ఆస్తులు అమ్మి హైదరాబాద్ వచ్చిన TSPSC అభ్యర్థుల పరిస్థితి.. ఆవేదన, తపన సీఎం కుటుంబానికి తెలియదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున ప్రవళిక ఆత్మహత్యను కప్పిపుచ్చుకున్నా.. పాపం మాత్రం కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ బీజేపీ చీఫ్ ధ్వజమెత్తాడు. మెట్ పల్లికి చెందిన రెహామత్ గ్రూప్స్ పరీక్ష వాయిదా పడితే ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు.. TSPSC నియామక పరీక్షలను అనేక సార్లు రద్దు చేసిన రికార్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Priyanka Gandhi: సబ్సిడీ సిలిండర్లు, రుణమాఫీ, ఉచిత కరెంట్.. ఛత్తీస్గఢ్లో ప్రియాంక హామీ
కొలువుల కోసం కొట్లడితే నిరుద్యోగులకు నిరాశే మిగిలింది అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అత్యధికంగా నిరుద్యోగులు 16 శాతం ఉన్నారు.. ఒక్క గ్రూప్-1 పోస్ట్ కూడా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు.. ఒక్క టీచర్ పోస్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీలప్ చేయలేదు.. నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది.. యూనివర్సిటీల్లో చాలా విభాగాలు మూత పడ్డాయి.. విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది అని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల పట్ల విశ్వాసం కోల్పోయారు.. రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు.. మోసం చేయడం కేసీఆర్ ప్రభుత్వ నైజం అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: World Cup 2023: ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతినెలా చివరివారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామో.. అదే తరహాలో ఉద్యోగ ఖాళీలు రాష్ట్రంలో భర్తీ చేస్తాం.. ఉపాధి పరంగా అన్ని రకాల వృత్తులను ప్రోత్సహిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
- Tags
- BRS
- cm kcr
- Kishan Reddy
- telangana
- tspsc
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. నకిలీ PMO కేసులో ట్విస్ట్.. ‘ఆఫర్ లెటర్, ఐడీ ఇచ్చారు’!
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!