Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy At Rozgar Mela Hyderabad

Kishan Reddy : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

Published Date :August 28, 2023 , 11:48 am
By Gogikar Sai Krishna
Kishan Reddy : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి.. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి అని 8వ జాతీయ రోజ్ గార్ మేళా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హాకీంపేట్ CISF, NISA, అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. CISF, CRPF, ITBP, SSB రంగాల్లో మొత్తం 4శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్​మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 8వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు 5లక్షల 50వేలకు పైగా మంది యువతకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ.. వెయ్యి-1200 ఏండ్ల క్రితం నుంచే మన దేశంపై దాడులు జరిగాయి. ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారన్నారు.

Also Read : UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

అంతేకాకుండా.. ‘అయినా.. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన కళలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయన్నారు. ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దేశ సమగ్రత చెక్కుచెదరలేదన్నారు. భారతీయుల్లో ఉన్నటువంటి జాతీయ భావన, యువతలో ఉన్నటువంటి దేశం కోసం, మన గడ్డ సమగ్రతను కాపాడేందుకు ఏదైనా చేయాలన్న సంకల్పమే కారణం. దేశ సేవలో మీరు భాగస్వామ్యులు కాబోతున్నారు. దేశ సమగ్రతను దేశ రక్షణకు మీరు అంకితం కాబోతున్నారు నేటి నుంచి మీరు అంకితభావంతో పని చేస్తూ దేశ సేవలో నిమగ్నమౌతారు ఈ క్రమంలో మీరు ఓ డిసిప్లైన్ మోడ్ లో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ద బడతారు అని నమ్ముతున్నాను. దేశం ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా తో పాటు గౌరవాన్ని పొందుతున్నాం దానికి ఉదాహరణ మొన్న చంద్రాయన్ పై అడుగు పెట్టడమే అన్నారు. అందుకే మీలాంటి యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పున:ప్రతిష్టించుకునేందుకు మోడీజీ సంకల్పించారు. మన దేశానికి.. స్పెషల్ అడ్వాంటేజ్ అయిన యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది మోడీ గారి ఆలోచన.

Also Read : Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు వారికి సరైన అవకాశాలు కల్పించడం మోడీ ఆలోచన. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా.. ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల కాలం ‘అమృత కాలం’. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో.. మనలోని బానిస ఆలోచనలను తొలగించుకుని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందడుగేయాలి. కేంద్రం యువతకు ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ.. ఉద్యోగాలకోసం వేచి చూసే పరిస్థితినుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి యువతను ప్రోత్సహిస్తున్నారు మన ప్రధాని మోడీ. 22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ప్రతి నెల 50నుంచి 70వేల మంది చొప్పున యువతకు అపాయింట్‌మెట్లు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇది 8వ రోజ్‌గార్ మేళా, ఇవాళ్టి కార్యక్రమంతో కలుపుకుని మొత్తంగా 5.5 లక్షలకు పైగా మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటాం. గతంలో ఉద్యోగాలంటే రికమండేషన్ ఉంటేనే వచ్చేది.. కానీ ఇవాళ రికమండేషన్ అవసరం లేకుండా.. టాలెంట్ ఉంటే ఉద్యోగం మీదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చింది. అదే సమయంలో NEP-2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసింది. ఇలా ఈ తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చే 25 ఏళ్ల అమృతకాలంలో.. మీరు మరింత శ్రమించి పనిచేస్తే.. భారతదేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా పనిచేయడం మరింత సులువు అవుతుంది. ఈ దిశగా మీ సహకారాన్ని ఆశిస్తూ.. మరోసారి మీకు, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • Kishan Reddy
  • latest news

తాజావార్తలు

  • Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!

  • Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!

  • Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

  • RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. తోపు ఎవరో తెలుసా?

  • IPL 2026 Begins Today: ధన్ ధనాధన్.. IPL 2026 నేటి నుంచి షురూ..!

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions