Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : ఇటీవల భారత జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా జనాలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదరితే అక్కడ సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇప్పటికే రాహుల్ సామాన్యలతో కలిసి లారీ నడిపారు, బైక్ మెకానిక్ గా మారారు, అంతేకాదు పొలం పనులు కూడా చేశారు. ఇక తాజాగా రాహుల్ చాక్లెట్లు కూడా తయారుచేశారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. రాహుల్ ఓ చిన్నారిని తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Afghanistan: మహిళలపై మరో ఆంక్ష విధించిన తాలిబన్ ప్రభుత్వం.. మరీ ఇంత దారుణమా?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ మార్గమధ్యంలో ఊటీలో ఆగారు. అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు రాహుల్. దాని గురించి చెబుతూ ఆశ్చర్యానికి గురయ్యారు రాహుల్. ఎందుకుంటే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో అందరూ మహిళలే ఉద్యోగం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు వారే చూసుకుంటారు. ఇక చాక్లెట్ ఎలా తయారు చేయాలో వారిని అడిగి తెలుసుకున్న రాహుల్ ఆయన కూడా తయారు చేశారు.
ఇక అక్కడే ఓ చిన్న పిల్ల బుక్, పెన్ పట్టుకొని వచ్చి రాహుల్ గాంధీని ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది. ఆమెకు తన ఆటోగ్రాఫ్ ఇచ్చిన రాహుల్ నాకు ఓ సాయం చేస్తావా అని ఆ చిన్నారిని అడిగారు. దీంతో ఆ చిన్నారి నవ్వుతూ తల ఊపింది. రాహుల్ ఆ చిన్నారిని తనకు బుక్, పెన్ కావాలని కోరారు. ఆ చిన్నారి ఆనందంగా ఆయనకు పెన్, బుక్ ఇచ్చింది. దానిని రాహుల్ గాంధీ ఆ పాపకే ఇచ్చేసి నీ ఆటోగ్రాఫ్ కావాలి ఇస్తావా అని అడిగాడు. దాంతో ఆ చిన్నారి తన పేరును ఆ బుక్ పై రాసి రాహుల్ కు ఇచ్చింది. రాహుల్ ఆ పేజీని చింపుకొని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఇది చూసిన వారు సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎంఎస్ఎంఈ లు అధిక ట్యాక్స్ ల కారణంగా ఎదగలేకపోతున్నాయని, 18 శాతం జీఎస్టీ వాటి విస్తరణకు పెద్ద అడ్డంకి అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను పంచుకుంది.
India’s MSME sector is as diverse as its culture and people.
The obligation to pay a substantial 18% GST is one of the main obstacles to their expansion.
Listen to @RahulGadhi ji’s full interaction here: https://t.co/iBkjn8cQQg pic.twitter.com/OnYZEt70Sb
— Congress (@INCIndia) August 27, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..