UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttara Pradesh School Closed: ఉత్తరప్రదేశ్ లో రెండో తరగతి చదువున్న ముస్లిం విద్యార్థిని ఓ టీచర్ ఇతర పిల్లలతో కొట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎక్కాలు సరిగా చెప్పలేదని తోటి విద్యార్థులతో కొట్టించినట్లు టీచర్ తెలిపింది. అయితే ఆమె అసభ్యంగా మాట్లాడిన మాటలు, మతం గురించి ప్రస్తావించడం వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యాశాఖ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు సందర్భంగా కూడా ఆ టీచర్ తాను చేసిన పని పట్ల సిగ్గుగా ఫీల్ అవడం లేదంటూ పేర్కొనడం గమనార్హం. ఇక ఇలా చిన్న చిన్న విషయాలను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తాము పని చేయడం కష్టమని, చిన్నప్పటి నుంచే పిల్లలకు భయం పెట్టాలని కూడా ఆ టీచర్ పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను కొడితేనే వారికి భయం ఉంటుందని ఆమె మాట్లాడారు.
Also Read: Donald Trump: ట్రంప్ తో అట్లుంటది మరి..కాసులు వర్షం కురిపిస్తున్న మగ్ షాట్
Also Read
ఇక దర్యాప్తు ప్రారంభించిన విద్యాశాఖ ఘటన జరిగిన నేహా పబ్లిక్ స్కూల్ మూసివేయాలని ఆదేశాలు జారిచేసింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు ప్రాధమిక విద్యాధికారి తెలిపారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్కూల్ గుర్తింపు రద్దు చేయడంతో వారిని వేరే చోట సర్థుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక ఈ ఘటన బాలుడి మానసిక పరిస్థితిపై దారుణంగా ప్రభావం చూపింది. బాలుడు రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడంతో ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ త్రిపాఠి త్యాగిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇకనైనా స్కూల్ టీచర్లు విద్యా్ర్థుుల పట్ల వ్యవహరించే తీరు మార్చుకోవాలని ఏ మాత్రం పొరపాటు జరిగిన స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఘటన ఎక్కడ మత విద్వేషాలకు దారి తీస్తుందో అని భావించిన అధికారులు వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడకూడదని పిల్లవాడి తండ్రితో స్కూల్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకుంది. అయితే వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!