Kishan Reddy : మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
- మూసీ ప్రక్షాళణపై రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
- మూసీ పరీవాహక ప్రాంతంలో కష్టపడి పేదలు ఇళ్లు కట్టుకున్నారు
- 30 ఏళ్ల కిందట నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోంది
- పేదల గూడు కూలగొట్టి సుందరీకరణ చేస్తామనడం సరికాదు.? పేదల ఇళ్లు కూల్చే ఆలోచన సీఎం రేవంత్ ఉపసంహరించుకోవాలి : కిషన్ రెడ్డి
కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసీ పరిధిలో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యమన్నారు. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోందని, గత 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. దీనిపై సీఎం రేవంత్ మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. పేద ప్రజల ఇండ్లు కూల్చడం ఏమాత్రం న్యాయం కాదని, అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదని, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వేలాది మంది ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్.. ఎలా ఉన్నాయంటే..?
అంతేకాకుండా..’నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి. అంతకంటే.. ముందు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించేలా కార్యాచరణను రూపొందించాలి. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి. పేదల గూడు కూలగొట్టి, సుందరీకరణ చేస్తామనడం ఎవరికోసం..? పేదల ఇండ్లు కూల్చే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. ప్రజల ఇండ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామంటూ చెబుతున్నాడు. దీనిని ప్రజలెవ్వరూ స్వాగతించట్లేదు. పేదల ఇండ్ల కూల్చాలనుకునే ముందు మమ్మల్ని జైలులో పెట్టి ఆ తర్వాత మీ కార్యాచరణ మొదలుపెట్టండి. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరికీ బిజెపి అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండాలని కోరుతున్నా. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 25వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తాం. రండి.. కదలిరండి.. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుదాం.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?