Killer Wolf: డ్రోన్ కెమెరాకు చిక్కిన 10 మందిని చంపిన కిల్లర్ తోడేలు..
- యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కొనసాగుతున్న కిల్లర్ తోడేళ్ల భయం
- 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం
- ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు
- తాజాాగా డ్రోన్ కెమెరాకు చిక్కిన మరో తోడేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది. సెప్టెంబరు 16న కోలెల గ్రామంలో మేకను వేటాడిన తోడేలు.. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. 10 రోజుల పాటు సైలెంట్ మోడ్లో ఉండి 10 మందిని చంపిన హంతక తోడేలు బుధవారం సాయంత్రం అటవీ శాఖ డ్రోన్ కెమెరాకు చిక్కింది.
Read Also: Student Died: నీళ్లు తాగేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లిన విద్యార్థి మృతి.. కారణమిదే..?
Also Read
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
మహాసి ప్రాంతంలో నెత్తుటి ఆటలు ఆడుతున్న ఐదు క్రూరమైన తోడేళ్లను సీసయ్య చూడామణి గ్రామంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరవ తోడేలు కోసం ఆ శాఖ బృందాలు సీసయ్య మరియు ఘఘ్రా బేసిన్తో సహా అనేక సమీప గ్రామాలలో వెతుకుతున్నారు. సెప్టెంబర్ 16న కోలెలకు చెందిన రామ్ కిషన్ మేకను ఎత్తుకెళ్లి ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ ఇంటి ముందు ఉన్న చెరుకు తోటలోకి వెళ్లిపోయిందని డీఎఫ్వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
Read Also: Himachal Pradesh: హిమాచల్ సర్కార్ యూటర్న్.. నేమ్ బోర్డు డిస్ప్లే ఉత్తర్వు విత్డ్రా
ఈ క్రమంలో.. ఎమ్మెల్యేతో పాటు అటవీ సిబ్బంది బృందాలు, గ్రామస్తులంతా చుట్టుముట్టి ఉచ్చు బిగించినా తోడేలు తప్పించుకుంది. అప్పటి నుండి అదెక్కడుందో గుర్తించలేదు. బుధవారం ఈ డ్రోన్ సీసయ్య చూడామణి నుంచి చహలారి వైపు వెళ్తున్న కెమెరాలో తోడేలు కనిపించింది. ఈ క్రమంలో.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బహ్రైచ్లోని మహసీ తహసీల్లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భయం ఉంది. నరమాంస భక్షక తోడేళ్ల సమూహం ఇప్పటివరకు 9 మంది పిల్లలతో సహా 10 మందిని చంపి తినేసింది. అలాగే.. దాని దాడిలో 60 మందికి పైగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..