Student Died: నీళ్లు తాగేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లిన విద్యార్థి మృతి.. కారణమిదే..?
- యూపీలో విషాదం
- మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి
- నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి
- ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయిన బాలుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. విద్యార్థి చేతిలో బెలూన్ ఉందని, బహుశా ఆ బెలూన్ అతని గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి పీల్చుకోవడానికి రాలేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.
Read Also: AP CM Chandrababu: ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
బహోరాలో నివాసం ఉంటున్న ఏడేళ్ల విద్యార్థి జాగర్ సింగ్.. బహోరా ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థి నీళ్లు తాగేందుకు ఒక్కసారిగా పరిగెత్తాడు. విద్యార్థి కుళాయి విప్పిన వెంటనే.. ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. విద్యార్థి నేలపై పడిపోవడంతో పాఠశాల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని లేపేందుకు ప్రయత్నించినప్పటికీ అతను లేవలేదు. దీంతో.. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి సీమాదేవి, తండ్రి జబర్ సింగ్ హడావుడిగా పాఠశాలకు చేరుకున్నారు.
Read Also: Rishabh Pant-Shubman Gill: పంత్ బౌలింగ్.. గిల్కు ముచ్చెమటలు (వీడియో)
వారు వెంటనే తమ కుమారుడిని 108 అంబులెన్స్లో కమల్గంజ్ సిహెచ్సికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా.. కొంతమంది విద్యార్థులు జాగర్ సింగ్ నోటిలో బెలూన్ కనిపించిందని చెప్పారు. బెలూన్ గొంతులో ఇరుక్కుపోవడంతో విద్యార్థి నీరు తాగేందుకు పరుగులు తీయగా, ఊపిరాడక చనిపోయాడు. పాఠశాలలో విద్యార్థి మృతి వార్త తెలియగానే ఎంపీ ముఖేష్ రాజ్పుత్, సబ్ కలెక్టర్ సదరు రజనీకాంత్ ఆస్పత్రికి చేరుకుని విషయంపై ఆరా తీశారు. మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!