Madhyapradesh: ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు గ్వాలియర్ నుంచి బయలుదేరి సిథౌలీ స్టేషన్కు చేరుకుంటున్న కొద్ది నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుండి పొగలు వచ్చినప్పటికీ, అసలు మంటలు లేవని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి స్పష్టం చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
“రైలు నెంబరు 19666 ఉదయపూర్ – ఖజురహో ఎక్స్ప్రెస్లోని ఇంజిన్లో పొగలు కనిపించాయి. వెంటనే రైలును ఆపి ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్-కాంటిలివర్ మూసివేశారని, ఈ నేపథ్యంలో పొగ నియంత్రించబడింది. మరో ఇంజన్ను అమర్చడం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తాం. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నాం.” అని ఎన్సీఆర్లోని హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. మంటలు చెలరేగడంతో రైలు రెండు గంటలకు పైగా నిలిచిపోయిందని పలువురు ప్రయాణికులు తెలిపారు.
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్ రైలులో అంతకుముందు రోజు కూడా ఇదే తరహాలో మంటలు చెలరేగాయి. రైలు బోగీల్లోంచి పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. “సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్కు చేరుకున్న ఉద్యాన ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు రైలు దిగిన 2 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదు. అగ్నిమాపక యంత్రాలు, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ” అని ఓ రైల్వే అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?