Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు. తీసుకోవాలి. వరదనీటిని తగ్గించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఉన్నావ్లోని గంగానది ఒడ్డున నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి కొద్ది దూరంలోనే ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం గంగానది నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని డీఎం అపూర్వ దూబే ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు 26 గ్రామాలు వరదల బారిన పడ్డాయని, ప్రజలకు సహాయం కోసం కొన్ని నిత్యావసర సామాగ్రిని అందిస్తున్నామని డీఎం తెలిపారు.
Minister KTR: ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు
మరోవైపు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. బంగర్మావు, సఫీపూర్, ఉన్నావ్ సదర్ మరియు బిఘపూర్ కత్రిలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నావ్ సదర్ ప్రాంతంలోని శుక్లగంజ్, రాజీవ్ నగర్ ఖాంటి, అహ్మద్నగర్, మనోహర్ నగర్, రెహ్మత్ నగర్ మరియు గంగానగర్ ప్రాంతాల్లోని డైవర్లు వరదల కారణంగా ఇంటిపైకప్పులపై ఉంటున్నారు.
Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?
అదే సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వరద సహాయక కేంద్రం, వరద నియంత్రణ కేంద్రాలను సంప్రదించవచ్చని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో వరదల కారణంగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద నీరు ప్రవహించడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆ ప్రాంత వాసులు తెలిపారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..