Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు. తీసుకోవాలి. వరదనీటిని తగ్గించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ఉన్నావ్లోని గంగానది ఒడ్డున నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి కొద్ది దూరంలోనే ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం గంగానది నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని డీఎం అపూర్వ దూబే ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు 26 గ్రామాలు వరదల బారిన పడ్డాయని, ప్రజలకు సహాయం కోసం కొన్ని నిత్యావసర సామాగ్రిని అందిస్తున్నామని డీఎం తెలిపారు.
Minister KTR: ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు
మరోవైపు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. బంగర్మావు, సఫీపూర్, ఉన్నావ్ సదర్ మరియు బిఘపూర్ కత్రిలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నావ్ సదర్ ప్రాంతంలోని శుక్లగంజ్, రాజీవ్ నగర్ ఖాంటి, అహ్మద్నగర్, మనోహర్ నగర్, రెహ్మత్ నగర్ మరియు గంగానగర్ ప్రాంతాల్లోని డైవర్లు వరదల కారణంగా ఇంటిపైకప్పులపై ఉంటున్నారు.
Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?
అదే సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వరద సహాయక కేంద్రం, వరద నియంత్రణ కేంద్రాలను సంప్రదించవచ్చని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో వరదల కారణంగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద నీరు ప్రవహించడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆ ప్రాంత వాసులు తెలిపారు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!