తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే నిర్మాణాలు చేసుకున్న వారు ఆగస్టు 1 నుంచి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Adah Sharma: అదా శర్మకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!
మరోవైపు దరఖాస్తులు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ శాఖ మూడు నెలల పాటు సమయం ఇచ్చింది. 125 గజాల లోపు ఉన్న నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. 125 గజాల నుంచి 3 వేల వరకు ఉన్న వాటికి ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.