Arvind Kejriwal: గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ యూనివర్శిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also : Sureshbabu : సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిర్మాత సురేష్ బాబు..!!
Also Read
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
ప్రధానమంత్రి మోడీ విద్యార్హతలు తెలియజేయాలంటూ 2016లో అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఒక లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రాజనీతి శాస్త్రంలో మోడీ మాస్టర్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని తెలిపారు. అయితే ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. మోడీ సర్టిఫికెట్ట్ ను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురించాలని ఆయన కోరారు.
Read Also : Bhagavanth Kesari : నటసింహం బాలకృష్ణ మాస్ ట్రీట్ చూశారా… అదిరిపోయిందిగా
దీంతో ప్రధాని మోడీ విద్యార్హతను వెల్లడించాలని ప్రధాని కార్యాలయం.. గుజరాత్ యూనివర్సిటీ.. ఢిల్లీ యూనివర్సిటీలను కోరారు సమాచార కమిషనర్. ఈ విషయం కోర్టుకి వెళ్లడంతో గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టేసింది. మోడీకి సంబంధించిన సర్టిఫికెట్లను సీఎంఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాదు కేసు వేసిన కేజ్రీవాల్ కు రూ. 25 వేల జరిమానా విధించింది. అందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
Read Also : Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
అయితే ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ డిగ్రీ పట్టాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని గుజరాత్ యూనివర్సిటీ చెప్పిందని అయితే విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో అలాంటి డిగ్రీ అసలు అందుబాటులోనే లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేగాక కేజ్రీవాల్ కు విధించిన రూ. 25 వేల జరిమానా విషయంలో కూడా సమీక్షించాలని తెలిపారు.
Read Also : Union Bank of India: నేటి నుంచి ఏపీలోని 120 యూబీఐ శాఖల్లో ఈ సేవలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవడం కోసం తను ఎలాంటి డిమాండ్ చేయలేదని సాధారణంగా ఒక లెటర్ ను మాత్రమే రాశానని దాన్ని సీఐసీ సుమోటగా స్వీకరించింది అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రివ్యూ పిటిషన్ పై విచారణను గుజరాత్ హైకోర్టు ఈ నెల 30వ తారీఖుకు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!