Sureshbabu : సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిర్మాత సురేష్ బాబు..?
తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దగ్గుపాటి సురేష్ కూడా ఒకడు. మూవీ మొఘల్ రామానాయుడు కొడుకు గా వెంకటేష్ లాగ సినీ నటుడు కాకుండా, నిర్మాతగానే కెరీర్ ని సాగిస్తూ వచ్చాడు.అయితే అప్పట్లో రామానాయుడు డేరింగ్ డాషింగ్ నిర్మాత. ఆ రోజుల్లో ఆయన ఎన్టీఆర్ మరియు నాగేశ్వర రావు వంటి వారితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో తీసి ఫ్లాప్ అయ్యినవి కూడా ఆయన కెరీర్ లో చాలానే ఉన్నాయి. హిట్ వచ్చినప్పుడు ఆయన పొంగిపోలేదు, అలాగే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కృంగిపోలేదు. డబ్బులు ఆయన ఆరోజుల్లో జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు.కానీ సురేష్ బాబు అందుకు పూర్తి గా విరుద్ధం అని చెప్పాలి.. ఎలాంటి రిస్క్ పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేసి థియేటర్స్ లో విడుదల చేస్తుంటాడు.
ఒకవేళ సినిమా ఆడదు అని అనిపిస్తే కనుక థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా ఓటీటీ లోనే నేరుగా విడుదల చేసేస్తాడు. ఆయన పెట్టిన ప్రతీ పైసా కి కూడా పది రూపాయిలు లాభం వస్తుంది అంటేనే ఏ పని అయినా కూడా చేస్తాడు. ఒకవేళ నష్టం వస్తుంది అందులో రిస్క్ ఉంది అని అనిపిస్తే కనుక అటు వైపు అస్సలు చూడడు. అలాంటిది తన రెండవ కొడుకు అభిరామ్ ని హీరో గా పరిచయం చేస్తూ , లేటెస్ట్ గానే ‘అహింస’ అనే సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. టీజర్ మరియు ట్రైలర్ విషయంలోనే ఎంతో నాసిరకం గా అనిపించిన ఈ సినిమా కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదని చెప్పాలి.. ఫలితంగా లీడర్ వంటి సినిమాతో తన అన్నయ్య లాగానే, అభిరామ్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడు అనుకుంటే, కనీసం గ్రాస్ వసూళ్లను కూడా అహింస రాబట్టలేకపోయింది. ఈ సినిమాకి సురేష్ బాబు దాదాపుగా 15 కోట్ల రూపాయిలు బడ్జెట్ ని ఖర్చు చేసాడని తెలుస్తుంది.. తాను నిర్మించే సినిమాలకు 5 కోట్ల బడ్జెట్ కి మించి ఖర్చు చెయ్యని సురేష్ బాబు ఏకంగా 15 కోట్లు ఈ సినిమాకి ఖర్చు చేసాడు. కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకపోవడం తో ఈ చిత్రానికి పెట్టిన డబ్బులు పోయి పూర్తిగా నష్టం వచ్చింది.అందుకే కొంతకాలం వరకు సినిమాలకు దూరం ఉండడమే మంచిది అని అనుకుంటున్నట్లు ఆయన సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లు ఇన్సైడ్ నుంచి టాక్ వచ్చింది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!