Sureshbabu : సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిర్మాత సురేష్ బాబు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దగ్గుపాటి సురేష్ కూడా ఒకడు. మూవీ మొఘల్ రామానాయుడు కొడుకు గా వెంకటేష్ లాగ సినీ నటుడు కాకుండా, నిర్మాతగానే కెరీర్ ని సాగిస్తూ వచ్చాడు.అయితే అప్పట్లో రామానాయుడు డేరింగ్ డాషింగ్ నిర్మాత. ఆ రోజుల్లో ఆయన ఎన్టీఆర్ మరియు నాగేశ్వర రావు వంటి వారితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో తీసి ఫ్లాప్ అయ్యినవి కూడా ఆయన కెరీర్ లో చాలానే ఉన్నాయి. హిట్ వచ్చినప్పుడు ఆయన పొంగిపోలేదు, అలాగే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కృంగిపోలేదు. డబ్బులు ఆయన ఆరోజుల్లో జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు.కానీ సురేష్ బాబు అందుకు పూర్తి గా విరుద్ధం అని చెప్పాలి.. ఎలాంటి రిస్క్ పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేసి థియేటర్స్ లో విడుదల చేస్తుంటాడు.
ఒకవేళ సినిమా ఆడదు అని అనిపిస్తే కనుక థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా ఓటీటీ లోనే నేరుగా విడుదల చేసేస్తాడు. ఆయన పెట్టిన ప్రతీ పైసా కి కూడా పది రూపాయిలు లాభం వస్తుంది అంటేనే ఏ పని అయినా కూడా చేస్తాడు. ఒకవేళ నష్టం వస్తుంది అందులో రిస్క్ ఉంది అని అనిపిస్తే కనుక అటు వైపు అస్సలు చూడడు. అలాంటిది తన రెండవ కొడుకు అభిరామ్ ని హీరో గా పరిచయం చేస్తూ , లేటెస్ట్ గానే ‘అహింస’ అనే సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. టీజర్ మరియు ట్రైలర్ విషయంలోనే ఎంతో నాసిరకం గా అనిపించిన ఈ సినిమా కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదని చెప్పాలి.. ఫలితంగా లీడర్ వంటి సినిమాతో తన అన్నయ్య లాగానే, అభిరామ్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడు అనుకుంటే, కనీసం గ్రాస్ వసూళ్లను కూడా అహింస రాబట్టలేకపోయింది. ఈ సినిమాకి సురేష్ బాబు దాదాపుగా 15 కోట్ల రూపాయిలు బడ్జెట్ ని ఖర్చు చేసాడని తెలుస్తుంది.. తాను నిర్మించే సినిమాలకు 5 కోట్ల బడ్జెట్ కి మించి ఖర్చు చెయ్యని సురేష్ బాబు ఏకంగా 15 కోట్లు ఈ సినిమాకి ఖర్చు చేసాడు. కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకపోవడం తో ఈ చిత్రానికి పెట్టిన డబ్బులు పోయి పూర్తిగా నష్టం వచ్చింది.అందుకే కొంతకాలం వరకు సినిమాలకు దూరం ఉండడమే మంచిది అని అనుకుంటున్నట్లు ఆయన సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లు ఇన్సైడ్ నుంచి టాక్ వచ్చింది.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!