ఎల్కతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ పోలీసులపై సంచన వ్యాఖ్యలు చేశారు. సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.. ఇది ఆపడం ఎవరితరం కాదు.. ఇక నుంచి నేను బయలుదేరతా.. ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం.. కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం.. కరెంట్ సరఫరా, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్.. అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read:MI vs LSG: ముంబై దెబ్బకు లక్నో విలవిల.. 54 పరుగుల భారీ విజయం సాధించిన ముంబై
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా.. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు.. కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు.. ఎవరైనా వాటిని ఆపుతారా.. ప్రభుత్వం నడపడం చేతకాక.. ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు.. వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు.. అది మంచి పథకమని నేను కొనసాగించాను.. ఆరోగ్య శ్రీ పథకం పేరు కూడా మార్చకుండా.. మేము కొనసాగించామని కేసీఆర్ వెల్లడించారు.