KCR : అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితుల బంధువును సత్వరమే లబ్ధిదారులకు పంపిణీ చేయకుంటే తాను, గుర్తించిన లబ్ధిదారులందరితో కలిసి నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఏప్రిల్ 13, శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది లబ్ధిదారులకు BRS ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. . తమ పార్టీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలకు జవాబుదారీగా చేయాలని పిలుపునిచ్చారు, ప్రచారం కోసం గ్రామాలకు వచ్చినప్పుడు, ప్రజలు మూగ ప్రేక్షకుడిలా ఆడవద్దని, ఇచ్చిన హామీలను సాధించడానికి పోరాడాలని రావు అన్నారు.
ఈ దేశంలో బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెండచం తప్ప, మతపిచ్చి లేపడం తప్ప, ఏదన్న మంచి పని జరిగిందా..? పెట్రోల్ ధర ఏంది.. డిజీల్ ధర ఏంది..? దేశంలో ఏం జరుగుతంది. మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా జైలుకు పోతావా..? అయితే మోడీ.. తప్పిడే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? ఇదేనా దేశాన్ని ముందకు తీసుకుపోయే పద్ధతి..? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి..? అంటూ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. గుడ్డిగా ఓటు వేయొద్దు. చాలా ఇబ్బందులు వస్తాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా..? ఒక్క మాట ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలు తెలంగాణకు మంజూరు చేయాలని నేను 100 ఉత్తరాలు రాశాను. ఒక్క కాలేజీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలా మనకు 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. వీటి కోసం వంద యాభై ఉత్తరాలు రాశాను. స్వయంగా అడిగాను. కానీ ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? దేని కోసం ఓటు వేయాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!