KCR : అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితుల బంధువును సత్వరమే లబ్ధిదారులకు పంపిణీ చేయకుంటే తాను, గుర్తించిన లబ్ధిదారులందరితో కలిసి నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఏప్రిల్ 13, శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది లబ్ధిదారులకు BRS ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. . తమ పార్టీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలకు జవాబుదారీగా చేయాలని పిలుపునిచ్చారు, ప్రచారం కోసం గ్రామాలకు వచ్చినప్పుడు, ప్రజలు మూగ ప్రేక్షకుడిలా ఆడవద్దని, ఇచ్చిన హామీలను సాధించడానికి పోరాడాలని రావు అన్నారు.
ఈ దేశంలో బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెండచం తప్ప, మతపిచ్చి లేపడం తప్ప, ఏదన్న మంచి పని జరిగిందా..? పెట్రోల్ ధర ఏంది.. డిజీల్ ధర ఏంది..? దేశంలో ఏం జరుగుతంది. మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా జైలుకు పోతావా..? అయితే మోడీ.. తప్పిడే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? ఇదేనా దేశాన్ని ముందకు తీసుకుపోయే పద్ధతి..? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి..? అంటూ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. గుడ్డిగా ఓటు వేయొద్దు. చాలా ఇబ్బందులు వస్తాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా..? ఒక్క మాట ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలు తెలంగాణకు మంజూరు చేయాలని నేను 100 ఉత్తరాలు రాశాను. ఒక్క కాలేజీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలా మనకు 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. వీటి కోసం వంద యాభై ఉత్తరాలు రాశాను. స్వయంగా అడిగాను. కానీ ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? దేని కోసం ఓటు వేయాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!