KCR : అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితుల బంధువును సత్వరమే లబ్ధిదారులకు పంపిణీ చేయకుంటే తాను, గుర్తించిన లబ్ధిదారులందరితో కలిసి నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఏప్రిల్ 13, శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది లబ్ధిదారులకు BRS ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. . తమ పార్టీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలకు జవాబుదారీగా చేయాలని పిలుపునిచ్చారు, ప్రచారం కోసం గ్రామాలకు వచ్చినప్పుడు, ప్రజలు మూగ ప్రేక్షకుడిలా ఆడవద్దని, ఇచ్చిన హామీలను సాధించడానికి పోరాడాలని రావు అన్నారు.
ఈ దేశంలో బీజేపీ పదేండ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెండచం తప్ప, మతపిచ్చి లేపడం తప్ప, ఏదన్న మంచి పని జరిగిందా..? పెట్రోల్ ధర ఏంది.. డిజీల్ ధర ఏంది..? దేశంలో ఏం జరుగుతంది. మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా జైలుకు పోతావా..? అయితే మోడీ.. తప్పిడే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? ఇదేనా దేశాన్ని ముందకు తీసుకుపోయే పద్ధతి..? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి..? అంటూ కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. గుడ్డిగా ఓటు వేయొద్దు. చాలా ఇబ్బందులు వస్తాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా..? ఒక్క మాట ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీలు తెలంగాణకు మంజూరు చేయాలని నేను 100 ఉత్తరాలు రాశాను. ఒక్క కాలేజీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలా మనకు 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. వీటి కోసం వంద యాభై ఉత్తరాలు రాశాను. స్వయంగా అడిగాను. కానీ ఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? దేని కోసం ఓటు వేయాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!